Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మ్యాన్‌హాట్టన్‌ దాడికి పాల్పడిన ఉగ్రవాదిని ఎలా కాల్చారంటే.. (వీడియో)

న్యూయార్క్‌లో ట్రక్కుతో దాడికి పాల్పడిన వ్యక్తిని సైఫుల్లో సైపోవ్‌గా గుర్తించారు. స్వస్థలం ఉజ్బకిస్తాన్. 2010లో అమెరికా వచ్చిన సైపోన్.. వచ్చిన కొత్తలో అతను ట్రక్కు డ్రైవర్‌గా చేశాడు. ఆ తర్వాత అతనికి గ

మ్యాన్‌హాట్టన్‌ దాడికి పాల్పడిన ఉగ్రవాదిని ఎలా కాల్చారంటే.. (వీడియో)
, బుధవారం, 1 నవంబరు 2017 (15:22 IST)
న్యూయార్క్‌లో ట్రక్కుతో దాడికి పాల్పడిన వ్యక్తిని సైఫుల్లో సైపోవ్‌గా గుర్తించారు. స్వస్థలం ఉజ్బకిస్తాన్. 2010లో అమెరికా వచ్చిన సైపోన్.. వచ్చిన కొత్తలో అతను ట్రక్కు డ్రైవర్‌గా చేశాడు. ఆ తర్వాత అతనికి గ్రీన్ కార్డు కూడా వచ్చింది. ప్రస్తుతం అతను ఉబర్ సంస్థలో డ్రైవర్‌గా చేస్తున్నాడు. ఇపుడు మ్యాన్‌హాట్టన్‌లో ట్రక్కుతో దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో 8 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే. 
 
ఇతనికి ఇస్లామిక్ స్టేట్‌ ఉగ్రసంస్థతో సంబంధాలు ఉన్నట్లు సమాచారం. దీన్ని రుజువు చేసేలా ఐసిస్‌తో సంబంధం ఉన్న లేఖను సైపోవ్ ట్రక్కులో పోలీసులు గుర్తించారు. ఆ లేఖపై ఐసిస్ జెండా గుర్తు కూడా ఉంది. అరబిక్ భాషలో రాసిన ఆ నోటును ట్రక్కు నుంచి సీజ్ చేశారు.
 
అయితే అతనికి పూర్తిగా బ్యాక్‌గ్రౌండ్ చెక్ నిర్వహించామని ఉబర్ పేర్కొన్నది. ఈ కేసులో ఎఫ్‌బీఐకి సహకరిస్తున్నామని ఆ సంస్థ తెలిపింది. సైపోవ్‌తో సంబంధం ఉన్న ఇతర వ్యక్తి గురించి కూడా ఆరా తీస్తున్నట్లు ఉబర్ సంస్థ వెల్లడించింది. 
 
మరోవైపు.. ట్రక్కుతో బీభత్సం సృష్టించి పారిపోయేందుకు ప్రయత్నించి సైపోవ్‌ను కాల్చి చంపారు. ఈ దాడికి పాల్పడిన తర్వాత పారిపోయేందుకు ప్రయత్నించాడు. ట్రక్కు నుంచి దిగి పరుగెడుతున్న అతను ఓ వీడియోకు చిక్కాడు. చేతిలో పిస్తోళ్లతో అతను రోడ్లపై పరుగులు తీశాడు. 
 
అల్లాహో అక్బర్ అంటూ అరుస్తూ పరుగెత్తాడు. ఇదేసమయంలో అక్కడకు చేరుకున్న పోలీసులు అతన్ని కడుపులో షూట్ చేశారు. రోడ్డు మీదే పడిపోయిన ఉగ్రవాది సైపోవ్‌ను పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతను హాస్పిటల్లో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు.. సచివాలయం కట్టితీరుతాం : కేసీఆర్