Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దుబాయ్‌లో 16 ఏళ్ల బాలుడిపై కీచక పర్వం.. విల్లాకు తీసుకెళ్లి ఐదుగురి అత్యాచారం..

దుబాయ్‌లో 16 ఏళ్ల బాలుడిపై కీచక పర్వం.. విల్లాకు తీసుకెళ్లి ఐదుగురి అత్యాచారం..
, శనివారం, 27 జులై 2019 (15:12 IST)
దుబాయ్‌లో దారుణం చోటుచేసుకుంది. 16ఏళ్ల బాలుడిపై ఐదుగురు పురుషులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కీచక పర్వం సంచలనం సృష్టించింది. ఐదుగురు పురుషులు ఓ విల్లాకు 16 ఏళ్ల బాలుడిని తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 19 వుంచి 25 ఏళ్ల వయస్సున్న ఐదుగురు నిందితులను పోలీసులు కోర్టు ముందు హాజరుపరిచారు. 
 
ఈ కేసు విచారణలో భాగంగా.. 16ఏళ్ల బాలుడిని కారులో ఎక్కించుకుని విల్లాకు తీసుకెళ్లారని.. ఏప్రిల్ 18వ తేదీన ఆ బాలుడిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని న్యాయవాదులు ఆరోపించారు. ఈ ఘటన అల్ ఖుసైన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. స్నాప్ చాట్ ద్వారా స్నేహితుడైన ఓ వ్యక్తి కలవమని పిలవడంతో వెళ్లానని బాధితుడు వాపోయాడు. 
 
అలా వెళ్ళిన తనను స్నాప్ చాట్ ద్వారా పరిచయమైన వ్యక్తి స్నేహితుడిని పంపి తనకు తీసుకెళ్లాడని చెప్పాడు. అక్కడ నుంచి ఐదుగురు తనను విల్లాకు తీసుకెళ్లారని.. అక్కడ ఓ గదలో నిర్భంధించి అత్యాచారానికి పాల్పడ్డారని తెలిపాడు. 
 
కత్తులతో బెదిరించి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని.. మరుసటి రోజు ఇంటికి తిరిగి పంపారని బాధితుడు చెప్పాడు. ఈ తతంగాన్ని వీడియో తీసి బెదిరించారని.. కానీ ఇంటికొచ్చిన ఆ యువకుడు ఈ విషయాన్ని తల్లిదండ్రుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బాగోతం బయటపడింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆరేళ్ళుగా యువతిని అనుభవించాడు.. ఆ విషయం చెప్పగానే చంపి పెరట్లో పాతేశాడు..?