Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నేపాల్‌లో భారీ భూకంపం: 69 మంది మృతి, పలువురికి గాయాలు

Advertiesment
earthquake
, శనివారం, 4 నవంబరు 2023 (09:12 IST)
నేపాల్‌లో భారీ భూకంపం ఏర్పడింది. శుక్రవారం అర్ధరాత్రి పశ్చిమ నేపాల్‌లో 5.6-తీవ్రతతో కూడిన భూకంపం సంభవించడంతో దాదాపు 69 మంది మరణించారు. డజన్ల కొద్దీ గాయపడినట్లు అధికారులు తెలిపారు.
 
పశ్చిమ జాజర్‌కోట్ జిల్లాలో శనివారం తెల్లవారుజామున 2:02 గంటలకు ఈ భూకంపం ఏర్పడింది. 18 కి.మీ లోతుతో భూకంపం సంభవించిందని యుఎస్ జియోలాజికల్ సర్వేను ఉటంకిస్తూ జిన్హువా వార్తా సంస్థ నివేదించింది. 
 
భూకంపం కారణంగా రుకుమ్ జిల్లాలో 35 మంది, పొరుగున ఉన్న జాజర్‌కోట్ జిల్లాలో 34 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. ప్రధాన మంత్రి పుష్ప కమల్ దహల్ భూకంపం కారణంగా ప్రాణనష్టం, ఆస్తినష్టం పట్ల విచారం వ్యక్తం చేశారు. 
 
తక్షణమే రెస్క్యూ మరియు రిలీఫ్ ఆపరేషన్‌లకు ఆదేశించారు. కాగా 2015లో ఇదే తరహా భూకంపం ఏర్పడింది. 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల దాదాపు 9,000 మంది మరణించారు. పర్వత దేశంలోని అర మిలియన్లకు పైగా ఇళ్లు ధ్వంసం అయ్యాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తాజ్‌ మహల్ షాజహాన్ నిర్మించలేదా? హిందూ మహాసేన పిటిషన్.. విచారణకు ఆదేశం