Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భూమిని పోలిన కొత్త గ్రహం... 30 శాతం నీళ్లే... సంవత్సరం అంటే 11 రోజులే

Earth
, శుక్రవారం, 26 ఆగస్టు 2022 (20:37 IST)
విశ్వంలోని సుదూర ప్రాంతంలో భూమిని పోలిన కొత్త గ్రహాన్ని ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది భూమి నుంచి వంద కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. భూమికంటే సుమారు 70శాతం పెద్దది. దీనికి ‘టాయ్‌-1452బీ’ అని నామకరణం చేశారు యూనివర్శిటీ ఆఫ్ మాంట్రియల్‌కు చెందిన ఖగోళ శాస్త్రవేత్తలు. 
 
ఇది భూమి కంటే ఐదు రెట్లు బరువైనది. ఈ గ్రహంలో ఎక్కడ చూసినా దట్టంగా నీళ్లున్నాయి. గ్రహం మొత్తం బరువులో 30 శాతం వరకు మహా సముద్రమే ఉంది. అందుకే దీన్ని ‘సముద్ర గ్రహం’గా పిలువొచ్చని శాస్త్రవేత్త కాడియక్స్ పేర్కొన్నారు. 
 
ఈ గ్రహానికి తన నక్షత్రం నుంచి కాంతి అందుతుంది. ఈ కొత్త గ్రహంపై సంవత్సరం అంటే 11 రోజులే. ఇది రెండు నక్షత్రాల చుట్టూ తిరుగుతుంది. దీనిపై ఇంకా విస్తృత పరిశోధన చేయాల్సి ఉందని కాడియక్స్ తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. సీఎం యోగీ ఓఎస్డీ దుర్మరణం