Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బికనేర్ వాసులను వణికించిన భూకంపం - రిక్టర్ స్కేలుపై 4.1గా నమోదు

earthquake
, సోమవారం, 22 ఆగస్టు 2022 (09:03 IST)
రాజస్థాన్ రాష్ట్రంలోని బికనేర్‌ సమీపంలో సోమవారం ఉదయం భూకంపం సంభవించింది. దీని తీవ్రత భూకంప లేఖినిపై 4.1గా నమోదైంది. బికనేర్ సమీప ప్రాంతాల్లో సోమవారం తెల్లవారుజామున 2.01 గంటల సమయంలో ఈ భూ ప్రకంపనలు కనిపించాయి. భూమి కంపించడంతో గాఢ నిద్రలో ఉన్న ప్రజలు ఒక్కసారి ఉలిక్కపడి లేచి తీవ్ర భయంతో వీధులు, రోడ్లపైకి పరుగులు తీశారు. 
 
బికనేర్ నగారనికి 236 కిలోమీటర్ల దూరంలో ఈ భూప్రకంపనలు కనిపించాయి. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.1గా నమోదైందని నేషనల్ సీస్మాలజీ కేంద్రం తెలిపింది. 10 కిలోమీటర్ల లోతులో సంభవించిన భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని బికనేర్ అధికారులు చెప్పారు. 
 
కాగా, శనివారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో సమీపంలో 82 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. ఇది రిక్టర్ స్కేలుపై 5.2గా నమోదైంది. శుక్రవారం కూడా ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పిఠోరాగడ్ ప్రాంతంలో భూమి కంపిచింది. అంతకుముందు జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోనూ ఈ భూప్రకంపనలు కనిపించాయి. ఈ వరుస భూకంపాలు పెద్ద భూకంపం వచ్చేందుకు ప్రమాద హెచ్చరికగా ప్రజలు భావిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అత్యంత ప్రతిభావంతుడైన నటుడు తారకరత్న : అమిత్ షా ట్వీట్