ఓ తండ్రీ కుమారులు సముద్రంలో రెండు పడవల్లో విహరిస్తున్నారు. కొడుకు ఒక పడవలో, తండ్రి మరో పడవలో ప్రయాణం చేస్తున్నారు. అయితే, కుమారుడు పడవ నడపడాన్ని తండ్రి వీడియో తీస్తున్నాడు. ఇంతలో ఓ భారీ తిమింగలం కుమారుడుతో పాటు అతని బోటును కూడా మింగినట్టే మింగేసి తిరిగి వదిలేస్తుంది. దీంతో ప్రాణాలతో బయటపడిన తన కుమారుడుని తండ్రి రక్షించి, ఒడ్డుకు చేరుస్తాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ముఖ్యంగా ఈ వీడియోను చూస్తే గుండె భయంతో కొట్టుకుంటుంది. ఈ వీడియోను ఇప్పటికే లక్షలాదిమంది వీక్షించడం గమనార్హం.
ఈ వైరల్ వీడియోలో సముద్రపు అలలు, వ్యక్తి పడవ ప్రయాణం చేస్తున్నట్టుగా ఉంటుంది. ఆ క్షణంలో ఓ భారీ తిమింగలం కుమారుడు పడవను మింగుతున్నట్టుగా వీడియోలో కనిపిస్తుంది. ఇదంతా అతని తండ్రి తీస్తున్న వీడియోల రికార్డు అయింది. అయితే, తిమింగలం వెంటనే ఆ వ్యక్తిని బయటకు ఉమ్మివేయడంతో అదృష్టంతో కొద్ది ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ మొత్తం ఘటనను తండ్రి తన మొబైల్లో చిత్రీకరించాడు. అయితే, ఈ ఘటన జరిగిందో మాత్రం తెలియలేదు. ఈ వీడియోను 9.1 మిలియన్ల మంది వీక్షించారు.