Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గతి తప్పిన చైనా స్పేస్ స్టేషన్.. భూమికి పెనుముప్పు.. ఢిల్లీ కనుమరుగు?

చైనా అంతరిక్ష పరిశోధనా కేంద్రం (స్పేస్ స్టేషన్) త్వరలో కూలిపోనుంది. దీనివల్ల భూమికి పెను ముప్పు ఏర్పడనుందని అంతరిక్ష పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. అంతరిక్ష రంగంలో అమెరికా, రష్యాలతో పోటీ పడాలని చైనా చే

గతి తప్పిన చైనా స్పేస్ స్టేషన్.. భూమికి పెనుముప్పు.. ఢిల్లీ కనుమరుగు?
, శుక్రవారం, 5 జనవరి 2018 (16:08 IST)
చైనా అంతరిక్ష పరిశోధనా కేంద్రం (స్పేస్ స్టేషన్) త్వరలో కూలిపోనుంది. దీనివల్ల భూమికి పెను ముప్పు ఏర్పడనుందని అంతరిక్ష పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. అంతరిక్ష రంగంలో అమెరికా, రష్యాలతో పోటీ పడాలని చైనా చేసిన ప్రయత్నం బెడిసి కొట్టడంతో భూమికి ఈ పెను విపత్తు ఏర్పడనుంది. 
 
చైనా స్పేస్ సెంటర్ గతి తప్పిందనీ, ఇది త్వరలోనే భూమిని ఢీకొడుతుందంటున్నారు. ఇదే జరిగితే న్యూఢిల్లీ వంటి నగరాన్ని నామరూపాల్లేకుండా చేస్తూ, కోటి మంది ప్రాణాలు తీస్తుందని స్పేస్ సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. 
 
చైనా ప్రయోగించిన తియాంగాంగ్-1 స్పేస్ స్టేషన్, 19 వేల పౌండ్ల బరువుతో భూమిపై పడనుందని, గత సంవత్సరం మార్చిలో నియంత్రణ కోల్పోయిన ఇది, నెమ్మదిగా భూమి వైపు వస్తూ, భూకక్ష్యలోకి వచ్చేసిందని చెబుతున్నారు. ఇది ఉత్తర, దక్షిణ ధృవాల మధ్య 43 డిగ్రీల అక్షాంశంలో ఎక్కడైనా పడొచ్చని అంచనా వేస్తున్నారు. 
 
మార్చిలోగా ఇది భూమిని తాకుతుందని, దీని మార్గంలో న్యూయార్క్, లాస్ ఏంజిల్స్, బీజింగ్, రోమ్, ఇస్తాంబుల్, టోక్యో నగరాలు ఉన్నాయని తేల్చారు. దురదృష్టవశాత్తూ, గతి తప్పిన ఈ స్పేస్ స్టేషన్ ఈ నగరాల్లో ఒకదానిపై పడితే, భారీ భవనాలు సైతం నేలమట్టమై, అక్కడి జీవరాశి మొత్తం అంతరిస్తుందని సైంటిస్టులు వెల్లడించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమెరికా సాయం నిలిపివేత.. ఆర్థిక కష్టాల్లో పాకిస్థాన్