Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఉగ్రవాదులను కొట్టిన చంపిన గ్రామస్థులు.. కానీ వాళ్లేం చేశారంటే?

ఉగ్రవాదులను కొట్టిన చంపిన గ్రామస్థులు.. కానీ వాళ్లేం చేశారంటే?
, సోమవారం, 4 జనవరి 2021 (13:46 IST)
పశ్చిమాఫ్రికా దేశం నైజర్‌లో ఉగ్రవాదులు విధ్వంసం సృష్టించారు. మాలి సరిహద్దు వద్ద రెండు గ్రామాలపై దాడి చేసి దాదాపు 100 మందిని చంపేశారు. ఈ ఘటనపై నైజర్‌ ప్రధానమంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
 
ఉగ్రదాడి జరిగిన తోచబంగౌ, జారౌమ్‌దారే గ్రామాలను సందర్శించిన ఆయన అక్కడి ప్రజలకు సానుభూతి తెలియజేశారు. శనివారం తమపై దౌర్జన్యం చేస్తున్న బోకోహారమ్‌కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను గ్రామస్థులు కొట్టి చంపేశారు.
 
ప్రతికారేచ్ఛతో రగిలిపోయిన ఉగ్రవాదులు రెండు గ్రామాలపై దాడి చేసి వంద మందిని కాల్చి చంపారు. బోకోహారమ్‌ గ్రూపునకు ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదాతో సంబంధాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అరుదైన దృశ్యం : డీఎస్పీ కుమార్తెకు సెల్యూట్ చేసిన సీఐ తండ్రి!!