Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భోజనానికి ముందు రెండు టీ స్పూన్ల నిమ్మరసం తీసుకుంటే

నిమ్మలో యాంటీ సెప్టిక్ లక్షణాలు, ఆకలి పెంచే గుణాలు అధికంగా ఉన్నాయి. అధికంగా మద్యం సేవించి హేంగోవర్ తలనొప్పితో బాధపడేవారు ఓ కప్పు టీలో కొద్దిగా నిమ్మరసం పిండుకుని తాగితే ఆ తలనొప్పి తగ్గుతుంది. భోజనానిక

భోజనానికి ముందు రెండు టీ స్పూన్ల నిమ్మరసం తీసుకుంటే
, గురువారం, 10 మే 2018 (17:57 IST)
నిమ్మలో యాంటీ సెప్టిక్ లక్షణాలు, ఆకలి పెంచే గుణాలు అధికంగా ఉన్నాయి. అధికంగా మద్యం సేవించి హేంగోవర్ తలనొప్పితో బాధపడేవారు ఓ కప్పు టీలో కొద్దిగా నిమ్మరసం పిండుకుని తాగితే ఆ తలనొప్పి తగ్గుతుంది. భోజనానికి ముందు రెండు టీ స్పూన్లు నిమ్మరసం తీసుకుంటే నిద్రమత్తు తగ్గుతుంది.
 
నిమ్మలోని ఫాస్ఫరస్ గుణం ఆహారం జీర్ణం కావడానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా చేపలు, మాంసం, గుడ్లు వంటివి నిమ్మరసం కలిపి తింటే త్వరగా జీర్ణం అవుతాయి. ప్రతిరోజూ పరగడుపున గ్లాసు నిమ్మరసం తీసుకోవడం ద్వారా జీర్ణకోశం శుభ్రమై, మలబద్ధకం తొలగిపోతుంది. మనిషి లావు తగ్గుతాడు.
 
దాహానికి నిమ్మరసం చక్కగా పనిచేస్తుంది. పొట్టలోని పురుగుల నివారణకు కూడా నిమ్మరసం ఉపయోగిస్తారు. ఇక నిమ్మరసం, బొప్పాయి జ్యూస్ కలిపి తీసుకుంటే అది జీర్ణక్రియను పెంపొందిస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కిడ్నీలో రాళ్లు పడకుండా వుండాలంటే.. ఎండుద్రాక్షల్ని?