Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అలాంటివారు శొంఠి పొడిలో చిటికెడు చొప్పున పిప్పళ్లు, ఇంగువ వేసి తీసుకుంటే?

అలాంటివారు శొంఠి పొడిలో చిటికెడు చొప్పున పిప్పళ్లు, ఇంగువ వేసి తీసుకుంటే?
, శనివారం, 31 జులై 2021 (16:38 IST)
నెలసరి సమస్యలున్నవారికి శొంఠి మేలు చేస్తుంది. ఈ పొడిలో చిటికెడు చొప్పున పిప్పళ్లు, ఇంగువ వేసి రెండు మూడు వారాల ముందు నుంచే తినిపించాలి. ఇలా చేస్తే నెలసరి సమస్యలను అడ్డుకోవచ్చు.
 
అజీర్ణ సమస్య ఉన్నప్పుడు గోరువెచ్చటి నీళ్లలో చిటికెడు శొంఠిపొడి, సైంధవలవణం వేసి తీసుకోవాలి.
 
కొబ్బరి నూనెలో కలిపి పూతలా రాస్తే కీళ్లు, మడమలు నొప్పికి పరిష్కారం లభిస్తుంది.
 
బాలింతలకు పొద్దుటే భోజనంలో శొంఠిపొడి, నెయ్యితో కలిపి ఇస్తే ఆకలి పెరిగి.. పాలు పడతాయి.
 
అజీర్ణం బాధిస్తున్నప్పుడు మొదటి అన్నం ముద్దను శొంఠిపొడి, నెయ్యితో తింటే ఎంతో మార్పు ఉంటుంది.
 
బరువు తగ్గాలనుకొనేవారు శొంఠిని పిప్పళ్ల చూర్ణంలో సమానంగా కలిపి రోజూ తేసెతో తీసుకోవాలి.
 
కఫం, ఎక్కిళ్లు, గొంతునొప్పి ఉన్నవారు గోరువెచ్చని నీళ్లతో శొంఠి పొడిని వేసి తీసుకోవాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అబ్బా... విపరీతంగా గొంతునొప్పి, ఎందుకని?