Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పండని మామిడి కాయను తింటే ప్రయోజనం ఏమిటో తెలుసా?

పూర్తిగా పండని మామిడి పండును తినడం వలన శరీరంలో కొత్త కణాలు పుట్టుకొస్తాయి. ఇందులోని విటమిన్ సి ఆహారంలోని ఐరన్‌ను గ్రహించే శక్తిని పెరిగేలా చేస్తుంది. టీ.బీ, రక్తహీనత, కలరా, రక్త విరేచనాలు రాకుండా శరీర

పండని మామిడి కాయను తింటే ప్రయోజనం ఏమిటో తెలుసా?
, మంగళవారం, 26 జూన్ 2018 (10:28 IST)
పూర్తిగా పండని మామిడి పండును తినడం వలన శరీరంలో కొత్త కణాలు పుట్టుకొస్తాయి. ఇందులోని విటమిన్ సి ఆహారంలోని ఐరన్‌ను గ్రహించే శక్తిని పెరిగేలా చేస్తుంది. టీ.బీ, రక్తహీనత, కలరా, రక్త విరేచనాలు రాకుండా శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. అలాగే స్కర్వీ వ్యాధిని నిరోధించటంలో కూడా పూర్తిగా పండని మామిడి పండు శక్తివంతంగా పనిచేస్తుంది. 
 
 
 
మామిడి ఆకులను నీటిలో నానబెట్టి ఆ నీటిని ప్రతిరోజు త్రాగడం వలన డయాబెటిస్ వ్యాధిని అరకట్టవచ్చును. స్త్రీలకు సంబంధించిన అనేక సమస్యలకు కూడా ఈ ఆకులు తీసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చును. 
 
పోషకాహార లోపంతో బాధపడే చిన్నారుల్లో వచ్చే రేచీకటిని కూడా మామిడి పండు నిరోధిస్తుంది. అలాగే కంట్లోని ఇతర సమస్యలకు కూడా ఇది దివ్యౌషధంగా పనిచేస్తుంది. బాగా పండిన మామిడి పండులో విటమిన్ ఏ పుష్కలంగా లబిస్తుంది. దీనివలన జలుబు, సైనసైటిస్ తదితర సమస్యలు దరిచేరకుండా ఉంటాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మూత్రం డార్క్ కలర్‌లో వస్తే...