Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

షుగర్ వ్యాధిగ్రస్తులకు హెర్బల్ జ్యూస్ లిస్ట్, ఏంటవి?

amla
, శుక్రవారం, 2 జూన్ 2023 (19:36 IST)
షుగర్ వ్యాధి. ఈ వ్యాధి వచ్చింది అనగానే తీసుకునే ఆహారంపై అనేక ఆంక్షలు వుంటాయి. నోటికి తాళం వేసుకోవాలేమో అన్నట్లు తయారవుతుంది పరిస్థితి. ఐతే  మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఉత్తమమైన రసాలు కొన్ని వున్నాయి. ఈ జ్యూస్‌లు ఇంట్లోనే తాజాగా తయారు చేసుకోవచ్చు. అవేమిటో తెలుసుకుందాము. రాత్రిపూట 2 టేబుల్ స్పూన్ల మెంతి విత్తనాలను నానబెట్టి ఆ నీటిని తాగుతుంటే బ్లడ్ షుగర్ నియంత్రణలో వుంటుంది.
 
ఉసిరి, కలబంద రసానికి కాస్తంత తేనె, మిరియాలు జోడించి సేవిస్తుంటే ఇన్సులిన్ స్థాయిలు పెరిగి బ్లడ్ షుగర్ స్థాయిలు తగ్గుతాయి. టేబుల్ స్పూన్ చియా గింజలను బాటిల్ నీటిలో నానబెట్టి దానిలో నిమ్మకాయ పిండి ఆ రసాన్ని తాగుతుంటే మధుమేహం అదుపులో వుంటుంది. వేడి నీటిలో ఏడెనిమిది తులసి ఆకులు వేసి అందులో కొద్దిగా అల్లం, నిమ్మరసం కలుపుకుని తాగితే ప్రయోజనం వుంటుంది.
 
మధుమేహాన్ని అదుపులో పెట్టుకునేందుకు ధనియాలు నీరు కూడా దోహదం చేస్తాయి. పాలకూర, మెంతికూరతో కలిపి చేసే రసం కూడా మధుమేహానికి అడ్డుకట్ట వేయగలదు. చక్కెర వేయకుండా తయారుచేసిన టొమాటో రసం మధుమేహ వ్యాధిగ్రస్తులలో రక్తం పలుచబడేందుకు సహాయపడుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సతమతం చేసే ముక్కుదిబ్బడ, వదిలించుకునే మార్గాలు ఇవే