Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఓరల్ యాంటీ-డయాబెటిక్ మందులను పంపిణీకి అబాట్- ఎంఎస్‌డి వ్యూహాత్మక భాగస్వామ్యం

Advertiesment
Diabetes

ఐవీఆర్

, మంగళవారం, 24 జూన్ 2025 (22:56 IST)
ఎంఎస్‌డి యొక్క ఓరల్ యాంటీ-డయాబెటిక్ మెడిసిన్, సిటాగ్లిప్టిన్, దాని కాంబినేషన్, సిటాగ్లిప్టిన్-మెట్‌ఫార్మిన్, భారతదేశంలో ఎక్స్‌టెండెడ్ రిలీజ్ వెర్షన్ కోసం పంపిణీ ఒప్పందం ద్వారా అబాట్, ఎంఎస్‌డి ఫార్మాస్యూటికల్స్ వ్యూహాత్మక సహకారాన్ని ప్రకటిస్తున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం, అబాట్ ఈ పోర్ట్‌ఫోలియోను పంపిణీ చేస్తుంది. భారతదేశ ప్రజలకు ఈ మందులను అందుబాటులో ఉంచడం కొనసాగించడానికి తన విస్తృత దేశీయ ఉనికిని ఉపయోగించుకుంటుంది. ఎంఎస్‌డి యొక్క సిటాగ్లిప్టిన్, దాని కాంబినేషన్, ఎక్స్‌టెండెడ్ రిలీజ్ వెర్షన్‌లు జానువియా, జానుమెట్, జానుమెట్ XR బ్రాండ్ పేర్లతో మార్కెట్ చేయబడతాయి.
 
సిటాగ్లిప్టిన్ అనేది DPP4i లేదా డైపెప్టిడైల్ పెప్టిడేస్ IV ఇన్హిబిటర్. దీనిని టైప్ 2 డయాబెటిస్ చికిత్సకు ఉపయోగిస్తారు. దీనిని ఎంఎస్‌డి ఫార్మాస్యూటికల్స్ కనుగొని అభివృద్ధి చేసింది. 2008లో భారత దేశంలో ప్రారంభించబడిన మొదటి DPP4i ఇది. ఈ పోర్ట్‌ఫోలియో కింద ఉన్న బ్రాండ్‌లు ప్రత్యేకతను కోల్పోయిన తర్వాత కూడా ఈ విభాగంలో అగ్రగామిగా కొనసాగుతున్నాయి.
 
భారతదేశంలో కనీసం 60 శాతం మరణాలు నాన్-కమ్యూనికబుల్ వ్యాధులు లేదా ఎన్సీడీల వల్ల సంభవిస్తున్నాయి. వీటిలో ప్రధాన కారణాలు మధుమేహం, హృదయ సంబంధ పరిస్థితులు, క్యాన్సర్. దేశంలో 101 మిలియన్ల మంది డయాబెటిస్‌తో బాధపడుతున్నారు. 136 మిలియన్ల మంది ప్రి-డయాబెటిక్ అంటే, భవిష్యత్తులో డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని అంచనా వేయబడ్డవారు.
 
‘‘భారతదేశంలో అతిపెద్ద వైవిధ్యభరిత ఆరోగ్య సంరక్షణ సంస్థగా, అబాట్ అత్యంత ముఖ్యమైన ఆరోగ్య సవాళ్లను, ముఖ్యంగా ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై గణనీయమైన భారాన్ని కలిగించే నాన్-కమ్యూనికబుల్ వ్యాధులకు సంబంధించి ప్రత్యేకంగా స్థానంలో ఉంది’’ అని భారతదేశంలోని అబాట్ వైస్ ప్రెసిడెంట్ అంబటి వేణు అన్నారు. ‘‘ప్రజలు డయాబెటిస్‌ను మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి సహాయపడటానికి మేం విస్తృత శ్రేణి పరిష్కారాలను అందిస్తున్నాం. వాటిలో పరీక్ష, నిరంతర గ్లూకోజ్ పర్యవేక్షణ, పోషకాహారం, పూర్తి డయాబెటిస్ ఔషధాల పోర్ట్‌ఫోలియో ఉన్నాయి. మా విస్తృతమైన ఉనికి ద్వారా, భారతదేశంలోని ప్రజలు వారి టైప్ 2 డయాబెటిస్‌ను బాగా నిర్వహించుకోవడంలో, వారి ఆరోగ్యాన్ని నియంత్రించుకోవడంలో మేం సహాయ పడగలం’’ అని అన్నారు.
 
‘‘17 సంవత్సరాల క్రితం భారతదేశంలో ప్రవేశపెట్టినప్పటి నుండి, మా సిటాగ్లిప్టిన్ పోర్ట్‌ఫోలియో దేశవ్యాప్తంగా లక్షలాది మంది రోగుల జీవితాలపై సానుకూల ప్రభావాన్ని చూపింది. వైద్యులు, రోగుల విశ్వాసాన్ని సంపాదించుకుంది. అబాట్‌తో మా భాగస్వామ్యం ఈ డయాబెటిస్ చికిత్సలతో భారతదేశం అంతటా రోగులకు సేవలను కొనసాగించడానికి వీలు కల్పించే సుస్థిరమైన వ్యాపార నమూనాను ఏర్పాటు చేస్తుంది" అని ఎంఎస్‌డి ఇండియా రీజియన్ మేనేజింగ్ డైరెక్టర్ రెహన్ ఎ. ఖాన్ అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...