Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చక్కెర అధికంగా తీసుకునేవారు ఇది ఖచ్చితంగా చదవాలి?

Advertiesment
sugar
, బుధవారం, 4 డిశెంబరు 2019 (21:17 IST)
శరీరంలోని ప్రతి భాగం మీద చక్కెరల ప్రభావం పడుతుందని అంటున్నారు వైద్యులు. తొలి ప్రభావం దంతాల మీద, పుచ్చుపళ్ళు ఏర్పడడానికి కారణం తీసి పదార్థమేనట. కాఫీ, టీలతో సహా మనం తీసుకునే పదార్థాలలోని చక్కెర మీద ఆధారపడి నోటిలో ఉండే సూక్ష్మ జీవులు సంఖ్య వృద్థి అవుతాయట. 
 
ఆ సంఖ్య పెరిగితే దంతాల మీద పచ్చగా గార ఏర్పడుతుందట. ఆ గారలోని వెలువడే ఆమ్లాలు దంతం మీదుంటే రక్షిత పొరను కలిగిస్తుందట. ఫలితంగా సూక్ష్మ రంధ్రాలు దంతం మీద ఏర్పడి అవి పెద్దవై క్యావిటీగా మారతాయి. దంతాల చిగుళ్ళ నుండి రక్తస్రావానికి కారణం చక్కెరలని తెలియదు. నోటిలోకి చేరే చక్కెరలు అధికమైతే చిగుళ్ళు దెబ్బతింటాయి. పలు రకాల దంత వ్యాధులు వస్తాయట. రక్తస్రావం జరుగుతుందట.
 
అంతే కాదు కీలక అంగాలైన కాలేయం, గుండె మీద చక్కెరల ప్రభావం తీవ్రంగా ఉంటుందట. పండ్లలో సహజంగా ఉండే చక్కెర ప్ఱక్టోజ్. మిగిలిన చక్కెరలకు భిన్నంగా ఈ ఫ్రక్టోజ్ అనేది కాలేయం ద్వారా మార్పులకు గురవుతుందట. కృత్రిమంగా తయారు చేస్తున్న ఆహార పదార్థాలలో ఈ ఫ్రక్టోజ్ షుగర్స్ అధికం.
 
ఈ తీపి పదార్థాల ప్రభావాన కాలేయం దెబ్బతింటుందట. మత్తు పానీయాలు తాగేవారి కాలేయం ఎలా దెబ్బతింటుందో చక్కెరలు అధికంగా తిన్నా అంతేనట. పొట్ట పెరగడంలోను చక్కెర పాత్ర ఉంటుందని గుర్తించాలంటున్నారు వైద్యులు. రక్తపోటుకు ఉప్పు కారణం అనుకుంటుంటారు. కానీ అధిక రక్తపోటు రావటానికి ఉప్పు కన్నా చక్కరలే అధిక కారణం అంటున్నారు. 
 
రక్తపోటు 90/60 నుండి 120/80 మధ్య ఉంటుంది. చక్కెరలు అధికంగా తీసుకునేవారిలో ఆ రక్తపోటు గరిష్టమైన 120/80 వైపుకు మళ్ళతుందట. చక్కెరలు అధికంగా తినేవారిలో రక్తపోటులో మార్పులు వస్తాయని, ఆ మార్పులు ఉప్పు వల్ల వచ్చే దాని కన్నా అధిక మంటున్నారు వైద్య నిపుణులు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బెల్లం తినడం వల్ల కలిగే 18 ప్రయోజనాలు ఇవే...