Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కాచిన వేడి నీళ్లు తాగుతున్నారా? అందులో చల్లని నీళ్లు పోస్తే..?

కాచిన వేడి నీళ్లు తాగుతున్నారా? అందులో చల్లని నీళ్లు పోస్తే..?
, సోమవారం, 5 నవంబరు 2018 (13:51 IST)
వేడిగా వున్న నీటితో తాగేందుకు అనువుగా చల్లని నీరు కలిపితే ప్రయోజనం వుండదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాచిన నీళ్లు మరీ వేడిగా ఉన్నాయని, అందులో చల్లని నీళ్లు పోస్తే ఎలాంటి ఫలితం కనిపించదు. వేడి వేడి నీటిని కప్పులోకి తీసుకుని కాసేపు ఆరబెట్టి తాగడం ద్వారా శరీరంలోని వ్యర్థాలు తొలగిపోతాయి. కానీ ఆ వేడి నీటిలో చల్లని నీటిని లేదా.. వేడి చేయని నీటిని చేర్చి తీసుకోవడం ద్వారా ఎలాంటి ప్రయోజనం వుండదు. 
 
ఈ నీటిని సేవించడం ద్వారా శరీరంలోని మలినాలు తొలగిపోవని.. అందుకే వేడి నీటిని కాసేపు ఆరిన తర్వాత తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. రోజూ వేడి నీళ్లు తాగడం ద్వారానే వ్యాధులను దూరం చేసుకోవచ్చు. కడుపు ఉబ్బరం, ఎక్కిళ్లు, జలుబు, దగ్గు, ఆయాసం తగ్గడానికి వేడినీరు ఎంతగానో తోడ్పడతాయి. తలనొప్పి, పార్శ్వపు తలనొప్పి ఇతర ఉదర రోగాలు తగ్గడానికి దోహదం చేస్తాయి. 
 
రాత్రి నిద్రపోయే వేళ వేడినీళ్లు తాగితే, వాతం, దగ్గు తగ్గుతాయి. తీసుకున్న ఆహారం చక్కగా జీర్ణమవుతుంది. మధుమేహ రోగులు రోజూ వేడినీళ్లు సేవించడం ఎంతో మేలు. దానివల్ల తిన్న ఆహార పదార్థాలు చక్కగా జీర్ణం కావడంతో పాటు, క్లోమగ్రంధి పని తీరు మెరుగుపడుతుంది. మధుమేహం నియంత్రణలో వుంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహిళలు ఆ సమస్యకు చెక్ పెట్టాలంటే.. ఇలా చేయాలి..?