Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బరువు తగ్గాలంటే.. నిమ్మరసం.. గోరువెచ్చని నీరు చాలు

నిమ్మరసాన్ని గోరువెచ్చని నీటిలో కలుపుకుని తాగితే సులభంగా బరువు తగ్గుతారని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. నిమ్మకాయలోని పెక్టిన్ అనే ప్రత్యేక ఫైబర్ బరువును సులభంగా తగ్గిస్తుంది. దీంతో మెటబాలిజం మెరుగ

బరువు తగ్గాలంటే.. నిమ్మరసం.. గోరువెచ్చని నీరు చాలు
, శుక్రవారం, 28 సెప్టెంబరు 2018 (17:46 IST)
నిమ్మరసాన్ని గోరువెచ్చని నీటిలో కలుపుకుని తాగితే సులభంగా బరువు తగ్గుతారని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. నిమ్మకాయలోని పెక్టిన్ అనే ప్రత్యేక ఫైబర్ బరువును సులభంగా తగ్గిస్తుంది. దీంతో మెటబాలిజం మెరుగుపడి ఆకలిని నియంత్రించి బరువు తగ్గేలా చేస్తుంది. పొద్దున్నే ఒక గ్లాస్ నిమ్మరసం తాగితే జీర్ణక్రియ మెరుగ్గా వుంటుంది. 
 
రోజు వారిగా నిమ్మ‌ర‌సం తాగితే కాలేయానికి టానిక్‌గా పనిచేసి, పైత్యరసాల ఉత్పత్తి  పెరుగుతుంది. నిమ్మరసంలోని విటమిన్ సి వల్ల రోగనిరోధక వ్యవస్థ మెరుగై, పలురకాల అంటురోగాల నుంచి బయటపడవచ్చు. గొంతునొప్పి, ఆస్తా ఇబ్బందుల నుంచి ఉపశమనం ఇచ్చే గుణం నిమ్మకుంది. నిమ్మకాయ రసం నీటిలో లేదా మజ్జిగలో పిండుకుని తాగటం ద్వారా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. 
 
గోరువెచ్చని నీటిలో నిమ్మరసం పిండి తాగితే ఇన్ఫెక్షన్లతో పోరాడగలిగే ఇమ్యూనిటీ పెరుగుతుంది. నిమ్మలోని సిట్రిక్‌యాసిడ్‌తో జీర్ణశక్తి చురుకవుతుంది. పంటినొప్పికి చక్కటి విరుగుడుగా నిమ్మరసం పనిచేస్తుంది. అలాగే క్యాన్సర్‌ కారకాలను నియంత్రిస్తుంది. నేత్ర సమస్యలను నివారిస్తుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్త్రీపురుషుల్లో ఆ సామర్థ్యాన్ని పెంచే చెర్రీ పండ్లు