Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కరోనా కాలం.. వేడినీటిని తాగితే.. అదీ పరగడుపున తీసుకుంటే?

కరోనా కాలం.. వేడినీటిని తాగితే.. అదీ పరగడుపున తీసుకుంటే?
, శనివారం, 8 ఆగస్టు 2020 (16:52 IST)
నీటిని సాధారణ రూపంలో కాకుండా వేడిగా ఉన్నప్పుడు తీసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చును. ఆ వేడి నీటిని పరగడుపున తీసుకుంటే అనారోగ్య సమస్యలు దరిచేరవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఉదయాన్నే రెండు గ్లాసుల వేడి నీటి తీసుకుంటే త్వరగా బరువు తగ్గుతారు. అంతేకాకుండా శరీరంలోని వేడి వేగంగా కరిగిపోతుంది.
 
ఇంకా శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది. ఉదయాన్నే తినడానికి ముందుగా గ్లాస్ వేడి నీటిని తీసుకుంటే కడుపు నొప్పి వంటి సమస్యలు తొలగిపోతాయి. ఇంకా జలుబు, దగ్గు వంటి రుగ్మతలు దరిచేరవు. శరీర మెటబాలిజం వేగవంతమవుతుంది. ఈ వేడినీళ్లు క్యాలరీలను తొలగించుటలో చక్కని ఔషధంగా పనిచేస్తాయి. శ్వాస కోశ సమస్యలు దూరమవుతాయి. శ్వాస ప్రక్రియ మెరుగుపడుతుంది.
 
పరగడుపున వేడి నీటిని తీసుకోవడం వలన రక్తప్రసరణ మెరుగుపడుతుంది. శరీరంలోని మలినాలు, చెడు పదార్థాలు, వ్యర్థాలు బయటికి వెళ్లిపోతాయి. జీర్ణక్రియ మెరుగుపరచుటలో వేడి నీళ్లు చక్కగా పనిచేస్తాయి. పైల్స్ సమస్యలతో బాధపడేవారు వేడి నీటిని తీసుకుంటే ఇలాంటి సమస్యల నుండి విముక్తి చెందవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అధిక బరువును తగ్గించే నారింజ పండ్లు.. రోజు వారీ డైట్‌లో చేర్చుకుంటే?