Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఒత్తిడి అధికమైతే.. రోజూ మధ్యాహ్న భోజనంలో ఒక కప్పు పెరుగు తీసుకోండి

పనిలో ఒత్తిడి అధికమైందా? ఆందోళన వేధిస్తుందా? అయితే వెంటనే ఓ కప్పు పెరుగును రోజువారీ డైట్‌లో చేర్చుకుంటే సరిపోతుంది. పెరుగును రోజు ఒకకప్పు తీసుకుంటే ఒత్తిడి మాయమవుతుందని ఆరోగ్య నిపుణలు సూచిస్తున్నారు.

ఒత్తిడి అధికమైతే.. రోజూ మధ్యాహ్న భోజనంలో ఒక కప్పు పెరుగు తీసుకోండి
, శనివారం, 1 జులై 2017 (12:12 IST)
పనిలో ఒత్తిడి అధికమైందా? ఆందోళన వేధిస్తుందా? అయితే వెంటనే ఓ కప్పు పెరుగును రోజువారీ డైట్‌లో చేర్చుకుంటే సరిపోతుంది. పెరుగును రోజు ఒకకప్పు తీసుకుంటే ఒత్తిడి మాయమవుతుందని ఆరోగ్య నిపుణలు సూచిస్తున్నారు. మానసిక ఆందోళనను తగ్గించే గుణం పెరుగులో ఉందని పరిశోధనలో తేలింది.

పెరుగు తింటే డిప్రెషన్ తగ్గిపోతుందట. ఇందులో ఎక్కువగా ఉండే లాక్టోబాసిల్లిస్‌ అనే బ్యాక్టీరియా ఒత్తిడిని, డిప్రెషన్‌ను తగ్గిస్తుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. పెరుగులో ప్రోటీన్లు, ఖనిజ లవణాలు, కాల్షియం, విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. 
 
బరువు తగ్గాలనుకునే వారికి పెరుగు దివ్యౌషధం లాంటిది. రాత్రి పూట అన్నంలో పెరుగును చేర్చి.. ఉదయం కొత్తిమీర, ఉల్లిపాయ కలిపి తినడం వల్ల బక్కపలచగా ఉన్న వారు పుష్టిగా తయారవుతారు. జీర్ణశక్తి పెరుగుతుంది.  అంతేకాదు శరీరానికి కాంతినిస్తుంది. ఇక గర్భిణులకు చాలా మంచిది. కానీ అధికంగా తీసుకుంటే వాతం చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అందుకే రోజుకో కప్పు చొప్పున పెరుగును మధ్యాహ్నం పూట భోజనంలో చేర్చుకుంటే ఆరోగ్యంగా ఉంటారని వారు సూచిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దగ్గరకొచ్చిన వ్యక్తిని ఏదో ఓ వంకతో దూరం పెట్టేస్తే ఇక అంతే సంగతులు