Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గురక తీవ్రతను బట్టి వ్యక్తి మరణించే అవకాశాన్ని కనిపెట్టొచ్చు.. ఎలా?

గురక తీవ్రతను బట్టి వ్యక్తి మరణించే అవకాశాన్ని కనిపెట్టొచ్చు.. ఎలా?
, సోమవారం, 22 అక్టోబరు 2018 (14:15 IST)
చూడటానికి చిన్న సమస్యలా అనిపించే గురక ఎంతో ప్రాణాంతకమైంది. దీనివల్ల గుండెపోటు, పక్షవాతం వంటి వాటికి కారణంగా ఉంది. ఆరోగ్యపరంగా ఇలా అనేక సమస్యలకు దారితీస్తోంది. అలాగే, కుటుంబంలో కలతలకూ గురక కారణమవుతోంది. భర్త/భార్యకు గురక సమస్య ఉందన్న కారణంగా ఎన్నో జంటలు విడాకులు తీసుకున్న సందర్భాలు లేకపోలేదు. 
 
నిద్రిస్తున్న సమయంలో శ్వాస సరిగ్గా ఆడకపోవడం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది కారణంగా ఈ సమస్య వస్తుంటుంది. ఈ తీవ్రత పెరిగే కొద్దీ ఇది అబ్‌స్ట్రక్టివ్‌ స్లీప్‌ ఆప్నియా(ఓఎస్ఏ)గా మారుతుంది. అయితే ఈ ఓఎస్ఏను బట్టి ఒక వ్యక్తి మరణించే అవకాశాన్ని ముందుగానే గుర్తించవచ్చని ఓ పరిశోధనలో తేలింది. ఈ మేరకు అమెరికన్‌ జర్నల్‌ ఆఫ్‌ రెస్పిరెటరీ అండ్‌ క్రిటికల్‌ కేర్‌ మెడిసిన్‌లో ఓ కథనం ప్రచురితమైంది.
 
ఇదిలావుంటే, ప్రమాదకరంగా మారిన గురక సమస్యకు లండన్ శాస్త్రవేత్తలు ఓ పరిష్కార మార్గాన్ని కనుగొన్నారు. సిలికాన్‌తో తయారు చేసిన ఈ ఉంగరంలో రక్తంలో ఆక్సిజన్‌ లెవెల్స్‌ గుర్తించే సెన్సార్లను అమర్చారు. నిద్రలో గురక సమస్యకు బ్లడ్‌ ఆక్సిజన్‌ రీడింగ్స్‌ పడిపోవడం సంకేతంగా భావిస్తారు. 
 
ఈ ఉంగరం ద్వారా ఆక్సిజన్‌ రీడింగ్‌ను పసిగట్టి వైద్యులకు కీలక సమాచారం అందజేసే వెసులుబాటు ఉంది. ప్రతి మూడు రోజులకోసారి ఈ ఉంగరాన్ని చార్జి చేసుకుంటే సరిపోతుందని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా, ఒంటరిగా ఉంటున్న వారికి ఈ రింగ్‌ ఎంతో ఉపయుక్తమని స్లీప్‌ ఎక్స్‌పర్ట్‌ డాక్టర్‌ నీల్‌స్టాన్లీ తెలిపారు. దీని ఖరీదు రూ.7500గా ఉందని వైద్యులు చెబుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అత్తిపండును అలా వాడితే పురుషులు శృంగారంలో...