Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఖర్జూరం పాలు తాగితే?

ఖర్జూరం పాలు తాగితే?
, శుక్రవారం, 13 జనవరి 2023 (23:26 IST)
డ్రై ఫ్రూట్స్ ఖర్జూరంను పాలలో కలిపి తాగడం వల్ల చాలా మేలు జరుగుతుంది. శరీరానికి కలిగే ఆ ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. ఖర్జూరంలో ఫైబర్, సెలీనియం, మెగ్నీషియం, పిండి పదార్థాలు, కాల్షియం, ప్రొటీన్లు, విటమిన్లు ఎ, సి, ఇ, బి, జింక్, ఫాస్పరస్, పొటాషియం, కాపర్, ఐరన్ ఉన్నాయి.
 
ఈ శీతాకాలంలో ఖర్జూలను పాలలో కలుపుకుని తాగుతుంటే శరీరాన్ని అవసరమైన పోషకాలు అందుతాయి. పాలతో కలిపి తాగడం వల్ల ఎముకలు దృఢంగా తయారవుతాయి. ఖర్జూరం పాలను తీసుకోవడం వల్ల రక్తహీనత నయమవుతుంది. చలికాలంలో పాలతో కలిపి తీసుకుంటే జీర్ణవ్యవస్థ బాగా పనిచేస్తుంది.
 
ఖర్జూరం పాలలో విటమిన్ బి6 ఉండటం వల్ల జ్ఞాపకశక్తి బలపడుతుంది. ఆరోగ్యంగా ఉండాలంటే పాలలో ఖర్జూరం కలుపుకుని తాగితే మేలు జరుగుతుంది. యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి ఉండటం వల్ల ఇది చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. ఐతే వైద్యుని సలహా మేరకు మాత్రమే ఆరోగ్య సంబంధిత చిట్కాలను ప్రయత్నించండి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దొండ కాయ ఆకుల పేస్టును తింటే ఏం జరుగుతుంది?