Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కాగితం ఎలా వచ్చింది?

కాగితం ఎలా వచ్చింది?
, శుక్రవారం, 30 ఆగస్టు 2019 (16:20 IST)
ప్రాచీన ఈజిప్టియన్లు నైలు నదీ తీరాల్లో పెరిగే పాపిరస్ అనే ఒక రకం గడ్డి మొక్క నుంచి రాయడానికి అనువైన కాగితం వంటి దాన్ని తయారు చేశారు. ఆ "పాపిరస్" అనే ఈజిప్ట్ పదం నుంచే "పేపర్" అనే పదం పుట్టింది. 
 
ఆ తరువాత చాలా కాలానికి చైనీయులు చెక్కతో గుజ్జు తయారుచేసి, దాన్ని బల్లపరుపుగా పరిచి, ఆరబెట్టి, కాగితాన్ని తయారు చేయడం ప్రారంభించారు. అదే పద్ధతిని అరబ్బులు ఇంకాస్త మెరుగుపరిచి, మెరుగైన కాగితాన్ని తయారు చేసారు. 
 
ఆ తరువాత ఆధునిక పద్ధతులు వచ్చి, రకరకాల కాగితాలు తయారయ్యాయి. అయితే పాపిరస్ మొక్క వల్లే మనకు పేపర్ వచ్చిందని గుర్తుంచుకోవాలి. 
 
పాపిరస్ నుంచి కాగితాన్ని తయారు చేయడమే కాకుండా చాపలు, బుట్టలు, తాళ్లు, చెప్పులు, పడవలు తయారు చేసేవారు. ఈ మొక్క వేరుని ఔషధంగానూ, ఆహారంగానూ, సుగంధద్రవ్యంగానూ ఉపయోగించేవారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రోజుకు 2 నుంచి 3 కప్పుల గ్రీన్ టీతో ఊపిరితిత్తులు క్లీన్