Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పాన్‌తో ఆధార్ అనుసంధానానికి గడువు పొడిగింపు

పాన్‌తో ఆధార్ అనుసంధానానికి గడువు పొడిగింపు
, సోమవారం, 1 ఏప్రియల్ 2019 (14:26 IST)
పాన్ కార్డ్ నంబర్‌తో ఆధార్ నంబర్‌ను లింక్ చేయమని ప్రభుత్వం కోరుతోంది. వీటిని లింక్ చేసుకునేందుకు మార్చి 31వ తేదీని గడువు తేదీగా నిర్ణయించింది. అయితే గడువుతేదీ పూర్తయినప్పటికీ చాలా మంది అనుసంధానం చేసుకోలేదు. ఈ అనుసంధాన ప్రక్రియకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల విభాగం గడువును పొడిగించింది.
 
వీటి అనుసంధానానికి గడువు ఇంతకుముందు ప్రకటించిన ప్రకారం మార్చి 31తో ముగియగా, తాజాగా మరో ఆరు నెలలపాటు ఆ గడువును పొడిగించింది. సెప్టెంబర్ 30లోపు వినియోగదారులు పాన్‌తో ఆధార్‌ను అనుసంధానం చేసుకోవచ్చు. 
 
ఇకపై ఆదాయపన్ను రిటర్న్ దాఖలు చేసేవారు తప్పనిసరిగా ఆధార్ నెంబర్‌ను కూడా  పొందుపరచాలని సూచించింది. ఈ నిబంధన ఏప్రిల్ 1 ,2019 నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొంది. ఆధార్ రాజ్యాంగ బద్దమేనని, ఐటీ రిటర్న్‌లు దాఖలు చేసేవారు తప్పనిసరిగా ఆధార్ నంబర్‌ను పొందుపరచాలని గతేడాది సెప్టెంబర్‌‌లో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఛీ..ఛీ జీవిత రాజశేఖర్‌లకు సిగ్గుందా? స్నేక్ బాబుకి రాడ్ దింపారుగా: శ్రీరెడ్డి