Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అమెరికా - చైనా మధ్య ఉద్రిక్తతలు: పెరుగుతున్న బంగారం ధరలు

అమెరికా - చైనా మధ్య ఉద్రిక్తతలు: పెరుగుతున్న బంగారం ధరలు
, శుక్రవారం, 15 మే 2020 (19:46 IST)
ప్రపంచవ్యాప్తంగా గల ఆర్థిక వ్యవస్థలన్నీ ఉత్పాదకత మరియు ఎగుమతి సదుపాయాలను ఈ లాక్‌డౌన్ సంబంధిత పద్ధతులు సడలించడం ద్వారా ఎలా పునఃప్రారంభించాలి అని చర్చించుకున్నాయి. అయినప్పటికీ కరోనా వైరస్ మరింత వ్యాప్తి కలుగుతుందనే ఆందోళనలు, మార్కెట్ మనోభావాలపై భారం మోపడం కొనసాగించాయి.
 
బంగారం
గురువారం రోజున, స్పాట్ బంగారం ధరలు 0.82 శాతం పెరిగి ఔన్సుకు 1729.3 డాలర్లకు చేరుకున్నాయి. ఎందుకంటే మహమ్మారి అనంతరం కోలుకునే సమయం ఎక్కువగా ఉంటుందని ఆశించడం వలన బంగారం ధర పెరిగింది. ప్రపంచంలోని, చైనా మరియు దక్షిణ కొరియా వంటి కొన్ని దేశాలలో, కొత్తగా కరోనా వైరస్ కేసులు ఆకస్మిక పెరుగుదలను నమోదు చేసాయి. ఇవి పునరుత్థాన వైరస్‌ను ఎలా ఎదుర్కోవాలో అనే ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి.
 
ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు ప్రకటించిన దూకుడుతో కూడిన ఉద్దీపన చర్యలు మరియు ఆర్థిక ప్యాకేజీలతో పాటు తక్కువ వడ్డీ రేట్లు బంగారం ధరలకు మద్దతు ఇచ్చాయి. వైరస్ వ్యాప్తిని నియంత్రించలేకపోయినందుకు చైనాపై తీవ్రంగా ఆరోపణలు చేసిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.
 
వెండి
గురువారం రోజున, స్పాట్ వెండి ధరలు 1.47 శాతం పెరిగి ఔన్సుకు 15.9 డాలర్లకు చేరుకున్నాయి. ఎంసిఎక్స్ ధరలు 2.7 శాతం పెరిగి కిలోకు రూ. 44135 కు చేరుకున్నాయి.
 
ముడి చమురు
గురువారం రోజున, యుఎస్ క్రూడ్ ఇన్వెంటరీ స్థాయిలు తరువాతి నెలల్లో మరింత క్షీణిస్తాయని ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ ప్రకటించిన తరువాత, ముడి చమురు ధరలు 8.9 శాతం పెరిగి బ్యారెల్ కు 27.6 డాలర్లకు చేరుకున్నాయి. డిమాండ్ మందగమనాన్ని ఎదుర్కోవటానికి సౌదీ అరేబియాతో పాటు ఒపెక్ యొక్క మిత్రదేశాలు చాలా దూకుడుగా మరియు గణన ఉత్పత్తి కోతలను ప్రకటించాయి. అదనంగా, కొన్ని పారిశ్రామిక కార్యకలాపాల పునఃప్రారంభం చమురు ధరల పెరుగుదలకు తోడ్పడింది. అయినా, ప్రపంచవ్యాప్తంగా విమాన మరియు రహదారి ట్రాఫిక్‌పై నిరంతర ఆంక్షలు చమురు ధరలలో మరింత పెరుగుదల లేకుండా అడ్డుకున్నాయి.
 
మూల లోహాలు
గురువారం రోజున, చాలా మూల లోహాలు తక్కువ స్థాయిలో ముగిశాయి. ఎందుకంటే కరోనా వైరస్ ఆందోళనలు భారీ భారాన్ని కలిగించడం కొనసాగించింది. యుఎస్ ఫెడరల్ రిజర్వ్ చైర్‌పర్సన్ జెరోమ్ పావెల్ దేశంలో ఆర్థిక పునరుద్ధరణకు ముందుగా ఊహించిన దానికంటే ఎక్కువ కాలం అవసరమని ప్రకటించిన తరువాత మూల లోహాల ధరలు మరింత తగ్గాయి.
 
రాగి
లాక్ డౌన్లను తొలగించడం అనేది, మిలియన్ల మంది ప్రజల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందనే ఆందోళనల నడుమ గురువారం లండన్ మెటల్ ఎక్స్ఛేంజ్ (ఎల్ఎమ్ఇ) రాగి ధరలు 0.42 శాతం తగ్గాయి. యుఎస్‌లో తీవ్రమైన పరిస్థితిని నియంత్రించడం విఫలమైనందుకు, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా వైపు వేళ్లు చూపడంతో చైనా సంబంధాలు గట్టి వాణిజ్య యుద్ధానికి దారితీస్తాయనే ఆందోళనలు కలిగించాయి.
 
ప్రధాన ఆర్థిక వ్యవస్థల పునఃప్రారంభంతో కఠినమైన సామాజిక దూర నిబంధనలను తగిన విధంగా ఎలా సమతుల్యం చేయవచ్చో చూడాలి. ప్రపంచం కొంతవరకు సాధారణ స్థితికి చేరుకుంటుందని, పెద్ద సంఖ్యలో నిరుద్యోగ కార్మికుల ఆందోళనలను తీర్చాల్సి ఉంటుందని తెలుస్తోంది.
 
-ప్రథమేష్ మాల్యా, ఛీఫ్ అనలిస్ట్, నాన్ అగ్రి కమ్మాడిటీస్, ఏంజెల్ బ్రోకింక్ లిమిటెడ్

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డిజిటల్ అగ్రి-లావాదేవీలను ప్రోత్సహించడానికి రైతులకు రిజిస్ట్రేషన్ ఫీజును మాఫీ చేసిన అగ్రిబజార్