Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

త్వరలోనే ఫిఫా ప్రపంచకప్‌ టోర్నీలో భారత్‌ను చూస్తాం: రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్

భారత్‌లో ఫుట్‌బాల్‌కు ఆదరణ పెరుగుతోందని.. చాలామంది ఐపీఎల్ టోర్నీ తరహాలో ఫిఫా ప్రపంచకప్‌ను చూసేందుకు సిద్ధంగా వున్నట్లు కేంద్ర క్రీడాశాఖ మంత్రి రాజ్యవర్ధన్‌సింగ్ రాథోడ్ తెలిపారు. త్వరలోనే ఫిఫా వరల్డ్‌క

త్వరలోనే ఫిఫా ప్రపంచకప్‌ టోర్నీలో భారత్‌ను చూస్తాం: రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్
, సోమవారం, 11 జూన్ 2018 (16:16 IST)
భారత్‌లో ఫుట్‌బాల్‌కు ఆదరణ పెరుగుతోందని.. చాలామంది ఐపీఎల్ టోర్నీ తరహాలో ఫిఫా ప్రపంచకప్‌ను చూసేందుకు సిద్ధంగా వున్నట్లు కేంద్ర క్రీడాశాఖ మంత్రి రాజ్యవర్ధన్‌సింగ్ రాథోడ్ తెలిపారు. త్వరలోనే ఫిఫా వరల్డ్‌కప్‌లో భారత జట్టు పాల్గొంటుందని మంత్రి తెలిపారు. ఫుట్‌బాల్‌లే కాదు ఏ క్రీడలోనైనా పోటీ ఇచ్చే సత్తా భారత్‌కు వుందని పేర్కొన్నారు. 
 
ఫిఫా వరల్డ్‌కప్‌లో భారత్‌ పాల్గొనకపోయినప్పటికీ ఆ టోర్నీలో పాల్గొనే సత్తా మనకుందని మంత్రి వ్యాఖ్యానించారు. ఆటగాళ్ల శిక్షణ పొందే అవకాశాలు, వారికి లభించే మద్దతు గతంలో కంటే ఇప్పుడు చాలా బాగుందని చెప్పుకొచ్చారు. పాఠశాలలు కేవలం చదువులపై కాకుండా ఆటల్లో ప్రోత్సాహం కలిగించేలా దృష్టి సారించాలని కోరారు.
 
ఫిఫా వరల్డ్‌కప్‌లో ఆటగాళ్ల నిబద్దత పరంగా కొన్నిసార్లు బ్రెజీల్‌, మరి కొన్ని సార్లు అర్జెంటీనా జట్లు ఇష్టమని, కానీ భారత్‌కే తాను అతిపెద్ద అభిమానినని రాథోడ్‌ చెప్పారు. త్వరలోనే ఫిఫా ప్రపంచకప్‌ టోర్నీలో భారత్‌ను చూస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఒక్క పెళ్లికే అష్టకష్టాలు పడ్డాను.. మళ్లీ ఇంకో పెళ్లినా : మహ్మద్ షమీ