Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పరకామణి చోరీ కేసు : ఫిర్యాదు చేసిన ఏవీఎస్వో అనుమానాస్పద మృతి

Advertiesment
deadbody

ఠాగూర్

, శుక్రవారం, 14 నవంబరు 2025 (13:33 IST)
తిరుమల తిరుపతి దేవస్థానంలో పరకామణికి సంబంధించిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తితిదే మాజీ ఏవీఎస్వో సతీశ్‌ కుమార్‌ అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలోని కోమలి రైల్వే ట్రాక్‌పై విగతజీవిగా కనిపించారు. పరకామణి కేసులో విదేశీ డాలర్లను దొంగతనం చేసిన రవికుమార్‌పై అప్పట్లో ఏవీఎస్వో సతీశ్ కుమార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 
ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు న్యాయస్థానంలో హాజరుపరచగా అప్పట్లో రాజకీయ నాయకులు, తితిదే ఉన్నతాధికారులు పోలీసుల ఒత్తిడితో ఆ కేసును న్యాయస్థానంలో సతీశ్‌ కుమార్‌ రాజీ చేసుకున్నారు. దీనిపై కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. 
 
ఈ నేపథ్యంలో ఈ కేసుపై సీఐడీ డీజీ రవిశంకర్‌ అయ్యన్నార్‌ బృందం ప్రస్తుతం దర్యాప్తు చేస్తోంది. దర్యాప్తు కీలక దశకు చేరుకుంటున్న సమయంలో.. కేసు రాజీ చేసుకున్న సతీశ్‌ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం సృష్టిస్తోంది. సతీశ్ కుమార్‌ ఆత్మహత్య చేసుకున్నారా? లేక ఎవరైనా హత్య చేసి రైలు పట్టాలపై పడేశారా? అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గ్యాంగ్ రేప్ చేసి బయటే తిరుగుతున్నాడు.. యువతి ఆవేదన (వీడియో)