Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

టీఎస్ పీఎస్సీలో లీకేజీ కలకలం - పరీక్ష రద్దుపై ఉత్కంఠ

tspsc logo
, మంగళవారం, 14 మార్చి 2023 (12:24 IST)
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ నిర్వహించిన పరీక్షల్లో లీకేజీ కలకలం చెలరేగింది. తాజాగా కూడా మరో ప్రశ్నపత్రం లీకైంది. దీంతో టీఎస్ పీఎస్సీ పరీక్షను రద్దు చేసే దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. దీంతో ఈ పరీక్ష రాసిన అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠత నెలకొంది. తాజాగా కూడా మరో ప్రశ్నపత్రం లీకైనట్టు వార్తలు రావడంతో ఈ పరీక్ష రద్దు కోసమే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తుంది. 
 
ఇటీవల టీఎస్ పీఎస్సీ వెటర్నరీ అసిస్టెంట్, టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ ఉద్యోగాల భర్తీ కోసం పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షా ప్రశ్నపత్రాలను ప్రవీణ్ అనే ఉద్యోగి లీక్ చేసినట్టు గుర్తించారు. మార్చి మొదటి వారంలో నిర్వహించిన అసిస్టెంట్ ఇంజనీర్ పరీక్ష ప్రశ్నపత్రం కూడా లీకైందని పోలీసులు నిర్దారించారు.ఈ నేపథ్యంలో ఈ నెల 5వ తేదీన జరిగిన అసిస్టెంట్ ఇంజనీర్ నియామక పరీక్షను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసినట్టు తెలుస్తుంది. 
 
కాగా, ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న ప్రవీణ్ టీఎస్ పీఎస్సీలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్‌గా పని చేస్తున్నాడు. కంప్యూటర్లలో భద్రపరిచిన ప్రశ్నపత్రాన్ని ప్రవీణ్ తన పెన్ డ్రైవ్‌లో కాపీ చేసుకుని వాటిని రేణుక అనే మహిళకు ఇచ్చినట్టు పోలీసులు గుర్తించారు. 
 
రేణుక ఆ ప్రశ్నపత్రాలను రూ.13.5 లక్షలకు ఇద్దరు అభ్యర్థులకు విక్రయించారు. మరోవైపు, ఈ కేసులో రేణుకతో పాటు ఆమె భర్త, సోదరుడు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగి రాజశేఖర్‌ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటివరకు మొత్తం 9 మందిని అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వారిలో ఓ పోలీస్ కానిస్టేబుల్ కూడా ఉండటం గమనార్హం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆఫ్రికాలో తుపాను భీభత్సం: వంద మందికి పైగా మృతి