Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దేవుడి మొక్కు తీర్చుకుని వస్తున్న దంపతులు... భర్త కళ్లముందే భార్యపై అత్యాచారం...

Advertiesment
crime

ఠాగూర్

, ఆదివారం, 16 ఫిబ్రవరి 2025 (18:40 IST)
తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డిలో ఓ దారుణం జరిగింది. దేవుడు మొక్కు తీర్చుకుని ఇంటికి వస్తున్న ఓ దంపతుల జంటపై కామాంధుడు పగబట్టాడు. భర్తను కొట్టి, ఆయన కళ్లముందే భార్యపై అత్యాచారానికి పాల్పడ్డారు. శుక్రవారం రాత్రి సంగారెడ్డి జిల్లా ఫసల్ వాదిలో తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలంలోని ఓ తండాకు చెందిన దంపతులు సంత్ సేవాలాల్ జయంతి సందర్భంగా మొక్కులు చెల్లించడానికి ఈ నెల 2వ తేదీన తమ స్వగ్రామం నుంచి అనంతపురం జిల్లా నేరడిగొండకు కాలినడకన వెళ్లారు. అక్కడ మొక్కులు చెల్లించిన తర్వాత కాలినడకన ఇంటికి తిరుగు ప్రయాణమైన ఆ దంపతులు శుక్రవారం రాత్రికి సంగారెడ్డి జిల్లా ఫసల్‌వాది గ్రామానికి చేరుకున్నారు. 
 
ఫసల్‌వాదిలోని జ్యోకిర్వాస్తు విద్యాపీఠంలో భోజనం చేసి పక్కనే ఉన్న ఓ చెట్టు కింద నిద్రపోయారు. అయితే, నిర్మాణంలో ఉన్న విద్యాపీఠం ఆలయంలో పెయింటింగ్ పనులు చేస్తున్న తమిళనాడుకు చెందిన మాధవన్ (34) సదరు వివాహితపై కన్నేశాడు. 
 
అర్థరాత్రి సమయంలో భర్త కళ్ల ముందే ఆమెపై అత్యాచారం చేశారు. అడ్డుకోబోయిన భర్తను రాయితో కొట్టి గాయపరిచాడు. నిందితుడు నుంచి తప్పించుకున్న భర్త 100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న సంగారెడ్డి రూరల్ పోలీసులు నిందితుడు మాధవన్‌‍ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు నేరం అంగీకరించడంతో కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెళ్లి ఊరేగింపు కోసం గుర్రంపై ఎక్కిన వరుడు గుండెపోటుతో ఒరిగిపోయాడు (Video)