Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కర్నాటకలో దారుణం.. బేకరీలో వ్యక్తిని నరికి చంపిన దుండగులు

Advertiesment
murder

ఠాగూర్

, సోమవారం, 2 జూన్ 2025 (14:21 IST)
కర్నాటక రాష్ట్రంలోని కొప్పళ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మే 31వ తేదీన బేకరీలో ఓ వ్యక్తిని కొందరు దుండగులు దారుణంగా చంపేశారు. ఈ హత్యకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఈ దారుణ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుల కోసం గాలిస్తున్నారు. 
 
పోలీసుల కథనం మేరకు.. మృతుడుని చెన్నప్ప నారినాల్‌గా గుర్తించారు. ఏడుగురు వ్యక్తుల బృందం అతడిని వెంబడించింది. దాంతో చెన్నప్ప స్థానికంగా ఉండే ఓ బేకరీలోకి వెళ్లి ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయత్నించాడు. అయితే, దుండగులు మాత్రం వెంటబడి అతనిపై కత్తులతో విచక్షణా రహితంగా దాడి చేశారు. కొందరు కత్తులతో దాడి చేస్తుంటే, మరో వ్యక్తి కర్రతో తలపై బలంగా కొట్టాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన చెన్నప్ప అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. 
 
కాగా, పాత కక్షలు, ఆస్తి వివాదాల కారణంగానే ఈ హత్య జరిగివుండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులకు, మృతుడుకి మధ్య గత కొంతకాలంగా ఆస్తికి సంబంధించిన తగాదాలు నడుస్తున్నట్టు సమాచారం. ఈ ఘటనపై సోషల్  మీడియాలో, స్థానిక ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. 
 
పట్టపగలు, అందరూ చూస్తుండానే ఇంతటి దారుణానికి ఒడిగట్టడం, అక్కడున్నవారు ఏమాత్రం స్పందించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ హత్యపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Kavamma: కావమ్మ తిరునాళ్లలో విషాదం: అమ్మవారికి దిష్టి తీస్తూ కుప్పకూలిపోయాడు..(video)