Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దివ్యాంగ బాలికను ముళ్లపొదల్లోకి లాక్కెళ్లి అఘాయిత్యం.. ఆ తర్వాత..

suicide

ఠాగూర్

, మంగళవారం, 10 సెప్టెంబరు 2024 (13:18 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ సత్యసాయి జిల్లా నంబులపూలకుంట మండలంలో ఓ దారుణం జరిగింది. దివ్యాంగ బాలికను ఓ కామాంధుడు ముళ్ల పొదల్లోకి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలను పోలీసులు వెల్లడించారు. 
 
కదిరి డీఎస్పీ శ్రీలత తెలిపిన మేరకు.. స్థానిక సారగుండ్లపల్లికి చెందిన నాగార్జున (32) వైసీపీ ప్రభుత్వ హయాంలో గ్రామ వలంటీరుగా పనిచేశాడు. రెండేళ్ల క్రితం అతనికీ వివాహమైంది. ఆదివారం తన భార్యను పుట్టింట్లో వదిలిపెట్టేందుకు వెళ్లిన నాగార్జున అదేరోజు రాత్రి తిరుగు ప్రయాణమయ్యాడు. ఆ సమయంలో అదే మార్గంలోని ఓ ఊరిలో దివ్యాంగ బాలిక, మరికొందరు చిన్నారులు కలిసి ఆడుకుంటూ కనిపించారు.
 
దీంతో నాగార్జున.. దివ్యాంగ బాలికను ముళ్ల పొదల్లోకి తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు. ఇది చూసిన చిన్నారులు కేకలు వేయడంతో గ్రామస్థులతో పాటు బాలిక తండ్రి అక్కడికి చేరుకున్నారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నించగా స్వగ్రామానికి పారిపోయాడు. అక్కడ నిర్మాణంలో ఉన్న ఓ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని రాసుకున్న సూసైడ్ నోట్ రాసి పెట్టగా, దాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భార్య, నవజాత శిశువును కాపాడాలి.. మూడేళ్ల కుమారుడిని అమ్మేశాడు..