Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గౌహతిలో హైదరాబాద్ యువతిపై అత్యాచారం

victim
, గురువారం, 28 జులై 2022 (13:08 IST)
గౌహతిలో హైదరాబాద్ నగరంలో యువతి అత్యాచారానికి గురైంది. బాధితురాలు గౌహతిలో నివసిస్తూ ఉండగా అత్యాచారాని
కి గురైంది. ఈ యువతిపై పలుమార్లు అత్యాచారం చేసిన నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఉత్తరాది మూలాలు ఉన్న బాధితురాలి తల్లిదండ్రులు హైదరాబాద్‌లో నివసిస్తున్నారని, వారికి సమాచారం అందించామని, గౌహతికి వారు బయలుదేరారని ఇక్కడి పోలీసులు తెలిపారు. 
 
గౌహతిలోని బరాలుముఖ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన జరిగింది. బాధితురాలు మంగళవారం ఠాణాలో ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు నిందితుడి ఇంటికి వెళ్లిన పోలీసులకు అతని ఆచూకీ లభించలేదు. నిందితుడు హర్యానాకు చెందిన సుధీర్ చౌదరిగా గుర్తించారు. ఈయన ఒక సంగీత కళాకారుడని, తన తండ్రితో కలిసి గౌహతిలో నివసిస్తున్నట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. 
 
స్థానికంగా ఉండే ఓ యోగా కేంద్రంలో బాధితురాలితో నిందితుడికి పరిచయం ఏర్పడింది. రెండు నెలలుగా ఇద్దరి మధ్య స్నేహం కొనసాగుతోంది. ఈ కొద్దికాలంలో నిందితుడి ఇంటిని బాధితురాలు నాలుగైదుసార్లు సందర్శించిందని పోలీసులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే సుధీర్‌ చౌదరి తనను నాలుగు రోజులుగా ఒక గదిలో బంధించి పలుమార్లు అత్యాచారం చేయడంతో పాటు హత్య చేసేందుకు ప్రణాళిక వేసినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
 
తాను కిటికీ తలుపు బద్దలుకొట్టి తప్పించుకొని వచ్చి ఫిర్యాదు చేస్తున్నట్లు పేర్కొంది. బాధితురాలు ఇక్కడి హటిగావ్‌లోని ఓ పేయింగ్‌ గెస్ట్‌ వద్ద ఉంటూ ఇంటీరియర్‌ డిజైనర్‌గా సేవలందిస్తోంది. వెదురు కళాకృతుల తయారీలో నిపుణురాలని పోలీసులు చెబుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గోదావరి వంతెనపై వెళ్లే రైళ్ల వేగం పెంపు