Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'మీ ఆయన నన్ను వేధిస్తున్నాడు' అని చెప్పినందుకు బాధితురాలిపైనే ఖాకీ దంపతుల దాడి...

Advertiesment
Lady victim

ఠాగూర్

, గురువారం, 12 జూన్ 2025 (13:11 IST)
'మీ ఆయన నన్ను వేధిస్తున్నాడు' అని చెప్పినందుకు బాధితురాలిపైనే తన భర్తతో కలిసి ఓ కానిస్టేబుల్ భార్య దాడికి తెగబడింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని లక్నోలో చోటుచేసుకుంది. ఈ వివరాలను పరిశీలిస్తే, లక్నోలోని లాల్‌పూర్ ప్రాంతానికి చెందిన 16 యేళ్ళ యువతి తన కుటుంబంతో కలిసి ఉంటోంది. వారి ఎదురింట్లో మరో జంట ఉంటోంది. వీరిద్దరూ కానిస్టేబుళ్లుగా ఉద్యోగం చేస్తున్నారు. అయితే, ఈ రెండు కుటుంబాలకు ఒకే బాత్రూమ్ ఉంది. ఈ క్రమంలో తాను ఒంటరిగా ఉన్న సమయంలో సదరు కానిస్టేబుల్ లైంగికగాను, అసభ్యంగా ప్రవర్తించినట్టు బాధితురాలు చెబుతోంది. 
 
పైగా, కానిస్టేబుల్ చాలాకాలంగా తనను చెడు దృష్టితో చూస్తున్నాడనీ, పలుమార్లు తన దారికి అడ్డొచ్చి, చేయి పట్టుకుని అసభ్యంగా మాట్లాడాడనీ పేర్కొంది. ఈ క్రమంలో సోమవాం ఈ వేధింపులు భరించలేక ఆ యువతి కానిస్టేబుల్ భార్యకు చెప్పింది. దీంతో ఆగ్రహించిన ఆ లేడీ కానిస్టేబుల్ తొలుత తన భర్తతో గొడవపడింది. కొంత సమయం తర్వాత బయటకు వచ్చి బాధితురాలిపై దాడి చేసిందని యువతి బోరున విలపిస్తూ చెప్పింది. 
 
తమ కుమార్తెపై దాడి చేయడాన్ని తల్లిదండ్రులు నిలదీయడంతో వారిపై కూడా దాడి చేశారు. ఈ ఘటనలో గాయపడిన బాధిత యువతిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు బీబీడీ పోలీస్ స్టేషనులో కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లైంగిక కోర్కె తీర్చాలని భర్త ఒత్తిడి: 53 ఏళ్ల భర్తను నరికేసిన 27 ఏళ్ల భార్య