కరోనా కష్టకాలంలో తలెత్తిన ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కేందుకు ఓ భర్త తన భార్యతో బలవంతంగా న్యూడ్ కాల్స్ బిజినెస్ చేయించాడు. తద్వారా రూ.18 లక్షల వరకు అర్జించారు. అయితే, తాను చేస్తున్న తప్పును తెలుసుకున్న ఆ మహిళ... ఇక తాను చేయనని మొండికేసింది. దీన్ని జీర్ణించుకోలేని భర్త... భార్యను చిత్రహింసలకు గురిచేశాడు. దీంతో ఇంటి నుంచి వెళ్ళగొట్టాడు. ఈ దారుణం ఏపీలోని తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలంలో వెలుగులోకి వచ్చింది.
ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ గ్రామానికి చెందిన భార్యాభర్తలు కరోనా సమయంలో ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్నారు. పెయింటింగ్ పనిచేసే మహిళ భర్తకు ఓ ప్రైవేట్ యాప్లో న్యూడ్ చేస్తే డబ్బులు వస్తాయని తెలిపింది. దీంతో భార్యకు నచ్చజెప్పి న్యూడ్ కాల్స్ మాట్లాడించేవాడు. ఇలా రెండున్నర సంవత్సరాల్లో రూ.18 లక్షలు సంపాదించారు. ఇకపై ఈ తప్పు చేయలేనని, ఇక్కడితో దీనికి పుల్స్టాఫ్ పెట్టేద్దామని చెప్పడంత భర్త ఆమెను వేధించడం మొదలుపెట్డాడు భౌతికదాడికి కూడా దిగాడు.
ఇటీవల గుర్తు తెలియని వ్యక్తులు కొందరు ఆమె ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో అత్తింటివారు వేధింపులు ఎదురయ్యాయి. తనపై వారు దాడి చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఇంటి నుంచి వెళ్లగొట్టారని పిల్లన్ని కూడా చూడనివ్వడం లేదని వాపోయారు. రామచంద్రాపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని అదే స్టేషన్లో పని చేసే కానిస్టేబుల్ ఒకరు తనకు అసభ్య సందేశాలు పంపుతున్నామని ఆరోపించారు. పోలీసులు ఉన్నతాధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని కోరారు.