తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా కేంద్రంలో దారుణం జరిగింది. స్థానిక వ్యవసాయ మార్కెట్లో పట్టపగలే ఓ దారుణ హత్య జరిగింది. అప్పన్నపేట గ్రామానికి చెందిన పొలం కుమార్ను ధర్మారం మండలం దొంగతూర్తి గ్రామానికి చెందిన వేల్పుల సంతోష్ అనే వ్యక్తి మెడపై కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు.
ఈ దాడిలో కుమార్ చనిపోయిన తర్వాత కూడా అతడి మృతదేహంతో పాటు ప్రైవేట్ భాగంపై కాలితో తన్నుతూ వికృతానందం పొందాడు. పోలీసులు నిందితుడుతో పాటు మరో మహిళను కూడా అదుపులోకి తీసుకున్నారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.
కాగా, మృతుడుతో పాటు ఉన్న మహిళ కూడా కత్తిగాయాలయ్యాయి. దీంతో ఆమె అపస్మారకస్థితిలోకి జారుకుంది. వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
లిఫ్టులో కిరాతకంగా వ్యక్తి హత్య.. బ్యాంకు భవనంలో దారుణం!
హైదరాబాద్ నగరంలోని హిమాయత్ నగర్లో దారుణం చోటుచేసుకుంది. పంజాబ్ నేషనల్ బ్యాంకు హిమాయత్ నగర్ శాఖ భవనంలో గుర్తు తెలియని వ్యక్తి హత్యకు గురయ్యాడు. హంతకులు మృతదేహాన్ని భవనం లిఫ్టులో వదిలి పరారయ్యారు. ఉదయం బ్యాంకుకు చేరుకున్న సిబ్బందికి లిఫ్టులో మృతదేహం కనిపించడంతో భయాందోళనలకు గురయ్యారు. వారు ఇచ్చిన సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులకు పలు సూచనలు చేసారు. మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు.. అత్యంత కిరాతకంగా ఈ హత్య జరిగిందని, పాత కక్షల కారణంగానే హత్య జరిగివుంటుందని భావిస్తున్నారు. మృతుడుకి సంబంధించిన వివరాలు, హంతకుడి ఆచూకీ కోసం పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరా దృశ్యాలను పరిశీలిస్తున్నారు.