Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ముంబైలో దారుణం : మాజీ ప్రియురాలిని స్పానర్‌తో కొట్టి చంపిన ప్రియుడు (Video)

murder

వరుణ్

, మంగళవారం, 18 జూన్ 2024 (19:06 IST)
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో దారుణం జరిగింది. తన మాజీ ప్రియురాలిని ప్రియుడు నడి రోడ్డుపై కొట్టి చంపేశాడు. అదీ కూడా స్పానర్‌తో ఈ దాడికి దాడిచేశారు. ఆ యువతి బోరున విలపిస్తున్నప్పటికీ ఏమాత్రం కనికరం లేకుండా ప్రాణాలు విడిచేంతవరకు కొట్టాడు. ఈ దారుణం మంగళవారం ఉదయం 8.30 గంటల సమయంలో అత్యంత బిజీగా ఉండే ప్రాంతంలో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 
 
ఈ దారుణానికి పాల్పడిన యువకుడిని 20 యేళ్ల రోహిత్ యాదవ్‌గా గుర్తించగా, యువతిని ఆర్తీ యాదవ్‌గా గుర్తించారు. దీనిపై ముంబై పోలీసులు స్పందించి రోహిత్ యాదవ్‌పై హత్యా కేసును నమోదు చేసి, విచారణ జరుపుతున్నారు. మాజీ ప్రియురాలిపై విచక్షణా రహితంగా రోహిత్ యాదవ్ దాడి చేస్తుంటే అనేక మంది పాదాచారాలు ఒక్కరు కూడా అడ్డుకోకుండా నిశ్చేష్టులై చూస్తూ నిల్చొండిపోయారు. అయితే, ఒక యువకుడు మాత్రం రోహిత్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించినా రోహిత్ ఆగలేదు. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇష్టం లేకపోతే... చెప్పలేని భాషలో అరుపులు.. అధికారులకు అయ్యన్న వార్నింగ్!! (Video)