Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రియుడిని కట్టేసి ప్రియురాలిపై హోంగార్డు అత్యాచారం!!

victim girl

ఠాగూర్

, ఆదివారం, 2 జూన్ 2024 (19:29 IST)
ఏకాంతంగా గడిపేందుకు వెళ్లిన ఓ ప్రేమ జంటను హోంగార్డు ఒకరు బెదిరించాడు. ఆ తర్వాత ఆమె ప్రియుడిని కట్టేసి, యువతిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఏపీలోని విజయనగరం జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాకు చెందిన ఓ ప్రేమజంట ఏకాంతం కోసం గ్రామ శివారులో ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లారు. వారిని చూసిన ఒక హోంగార్డు రాజ్‌కుమార్... పోలీస్ వాహనంతో వెళ్లి వారిని బెదిరించాడు దీంతో తమను వదిలివేయాలంటూ వారు ప్రాధేయపడటంతో డబ్బు డిమాండ్ చేశారు. 
 
వాు తమ వద్దవున్న డబ్బులు ఇవ్వంగా వాటిని తీసుకున్న హోంగార్డు రాజ్‌కుమార్ తన వక్రబుద్ధిని చూపించాడు. యువకుడిని బంధించి యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో కేసు పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, నిందితుడు రాజ్‌కుమార్ సొంతూరు విజయనగరం కాగా, ప్రస్తుతం శ్రీకాకుళంలో ఓ డీఎస్పీ వద్ద కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఈ లైంగిక దాడి ఘటన వెనుక మరో వ్యక్తి కూడా ఉన్నట్టు తెలుస్తుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు : ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇవే..