Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆడుతూ పాడుతూ ఆసీస్ వచ్చేసింది ఫైనల్‌కి, భారత్‌తో 19న ఢీ

Advertiesment
australia team
బ్యాటింగ్ ఎంచుకుని ఆస్ట్రేలియా జట్టు ముందు భారీ లక్ష్యాన్ని వుంచాలని చతికిలపడింది దక్షిణాఫ్రికా. ఆదిలోనే టపటపా వికెట్లను పారేసుకుని 212 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఈ స్వల్ప లక్ష్యాన్ని ఆసీస్ ఆటగాళ్లు ఆడుతూపాడుతూ బాదేసారు. మరో 16 బంతులు మిగిలి వుండగానే 3 వికెట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్లోకి దూసుకెళ్లారు. ఆదివారం నాడు నవంబర్ 19న టీమిండియాతో ఆస్ట్రేలియా తలపడుతుంది.
 
213 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ ఆటగాళ్లు ట్రవిస్-డేవిడ్ వార్నర్ దూకుడుగా ఆడారు. ట్రవిస్ 62 పరుగులు, డేవిడ్ వార్నర్ 29 పరుగులు చేసారు. ఆరంభంలో గట్టి పునాది వేయడంతో ఆ తర్వాత వచ్చినవారికి లక్ష్య ఛేదన చాలా తేలికగా మారింది. మార్ష్ డకౌట్ అయ్యాడు. స్మిత్ 30, మార్నస్ 18, మాక్స్‌వెల్ 1, జోష్ 28, మిచెల్ స్టార్క్ 16 నాటౌట్, పాట్ కమిన్స్ 14 నాటౌట్‌గా నిలిచారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పిచ్ మార్పుపై పిచ్చి కూతలొద్దు.. పాక్ క్రికెటర్లకు గవాస్కర్ వార్నింగ్