Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సరికొత్త రికార్డు నెలకొల్పిన కోహ్లీ - రహానే

సరికొత్త రికార్డు నెలకొల్పిన కోహ్లీ - రహానే
, ఆదివారం, 25 ఆగస్టు 2019 (14:11 IST)
వెస్టిండీస్ పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు తొలి టెస్టు మ్యాచ్ ఆడుతోంది. అయితే, ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, బ్యాట్స్‌మెన్ అజింక్యా రహానేలు ఓ సరికొత్త రికార్డు నెలకొల్పారు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో తరపున అత్యధిక సెంచరీల భాగస్వామ్యం జోడీగా నిలిచారు.
 
వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భాగంగా రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లీ - రహానేల జోడి వందకుపైగా పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి వీరిద్దరూ తలో హాఫ్‌ సెంచరీ సాధించి అజేయంగా 104 పరుగుల్ని జత చేశారు. ఫలితంగా భారత్‌ తరఫున అత్యధిక సార్లు వంద పరుగుల భాగస్వామ్యాన్ని సాధించిన జోడిగా కొత్త రికార్డు నమోదు చేసింది.
 
ఈ క్రమంలోనే దిగ్గజ ఆటగాళ్లు సౌరవ్‌ గంగూలీ-సచిన్‌ టెండూల్కర్‌ల రికార్డును కోహ్లీ - రహానేలు బ్రేక్‌ చేశారు. నాల్గో వికెట్‌కు గంగూలీ - సచిన్‌లు ఏడుసార్లు సెంచరీ భాగస్వామ్యాల్ని సాధించగా, కోహ్లీ - రహానేలు దాన్ని సవరిస్తూ ఎనిమిదో సారి వంద పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. 
 
భారత్‌ తరఫున టెస్టు ఫార్మాట్‌లో నాలుగో వికెట్‌కు అత్యధికసార్లు వంద పరుగులు భాగస్వామ్యాల్ని సాధించిన జోడీల జాబితాలో తొలి రెండు స్థానాల్లో కోహ్లీ - రహానే, గంగూలీ - సచిన్‌ల జోడి ఉండగా, ఆపై మూడో స్థానంలో మహ్మద్‌ అజహరుద్దీన్ - సచిన్‌ల జోడి(ఆరుసార్లు) ఉంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అప్పుడు ఆ నిర్ణయం తీసుకున్నా.. కానీ ఇప్పుడు తపిస్తున్నా.. అంబటి రాయుడు