Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గౌహతి టెస్ట్ మ్యాచ్ : రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో 489 రన్స్‌కు సౌతాఫ్రికా ఆలౌట్

Advertiesment
South Africa Beat India

ఠాగూర్

, ఆదివారం, 23 నవంబరు 2025 (16:49 IST)
గౌహతి వేదికగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సఫారీలు తమ తొలి ఇన్నింగ్స్‌లో 489 పరుగులకు ఆలౌట్ అయ్యారు. సఫారీ ఆటగాళ్లలో ముత్తుసామి సెంచరీ చేసాడు. తొలి రోజు స్కోరు 247/6 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆ జట్టు భారీ స్కోరు సాధించింది. ఓవర్‌నైట్ 25 పరుగులతో ఆటను కొనసాగించిన ముత్తుసామి (109; 206 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీ చేశాడు. టెస్టుల్లో అతనికిది తొలి శతకం కావడం విశేషం. 
 
తొమ్మిదో స్థానంలో వచ్చిన మార్కో యాన్సెన్ (93; 91 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్స్‌లు) భారీ ఇన్నింగ్స్ ఆడాడు. 53 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ చేసిన యాన్సెన్ చివరి వికెట్‌గా వెనుదిరిగాడు. కైల్ వెరినె (45; 122 బంతుల్లో) రాణించాడు. తొలి రోజు ట్రిస్టన్ స్టబ్స్ (49), తెంబా బావుమా (41), మార్‌క్రమ్ (38), రికెల్‌టన్ (35) పరుగులు చేశారు. భారత బౌలర్లలో కుల్‌దీప్ యాదవ్ 4, రవీంద్ర జడేజా, సిరాజ్, బుమ్రా రెండేసి వికెట్లు పడగొట్టారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గౌహతి టెస్ట్ మ్యాచ్ : భారీ స్కోరు దిశగా సఫారీలు