Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Bengaluru Cricket Stadium: ఆర్సీబీ సక్సెస్ పరేడ్ తొక్కిసలాట‌కు కారణాలు ఏంటో తెలుసా?

Advertiesment
Bengaluru Cricket Stadium

సెల్వి

, గురువారం, 5 జూన్ 2025 (11:43 IST)
Bengaluru Cricket Stadium
బెంగళూరు ఆర్సీబీ సక్సెస్ పరేడ్‌లో జరిగిన తొక్కిసలాటపై పోలీసులు స్పందించారు. ఉచిత పాస్‌లు, రద్దీ, చిన్నస్వామి స్టేడియంలో పరిమిత సీట్లు వంటి గందరగోళం తొక్కిసలాటకు దారితీసిన కొన్ని ప్రధాన కారణాలుగా చెప్పబడుతున్నాయి. దీని ఫలితంగా కనీసం 11 మంది మరణించారు. 30 మందికి పైగా గాయపడ్డారు.
 
చిన్నస్వామి స్టేడియంలోకి ప్రవేశ టిక్కెట్లు లేని అనేక మంది క్రికెట్ ఔత్సాహికులు ప్రవేశించారని.. దీంతో ఆరంభంలో గందరగోళం తరువాత తొక్కిసలాటగా మారిందని పోలీసు వర్గాలు తెలిపాయి.
 
గందరగోళం సమయంలో, కొంతమంది నేలపై పడిపోయారు. మరికొందరు స్టేడియంలోకి ప్రవేశించడానికి భారీ గేట్లు ఎక్కే ప్రయత్నంలో గాయపడ్డారు. స్టేడియం సమీపంలో జరిగిన తొక్కిసలాటలో 11 మంది మరణించారని, 33 మంది గాయపడ్డారని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు.
 
మరణించిన వారిలో ఎక్కువ మంది యువకులు, పురుషులు, మహిళలు, వారిలో చాలామంది విద్యార్థులు వున్నారు. స్టేడియం 35,000 మందికి సామర్థ్యం కలిగి ఉందని, కానీ 2-3 లక్షల మంది వచ్చారని సిద్ధరామయ్య అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాన్పూర్‌ యువతి వంశికతో భారత క్రికెటర్ కుల్దీప్ యాదవ్ నిశ్చితార్థం