Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కివీస్‌తో టీ20 మ్యాచ్ : సూర్యకుమార్ మెరుపులు - కివీస్ టార్గెట్ 192 రన్స్

bhuvaneshwar kumar
, ఆదివారం, 20 నవంబరు 2022 (14:49 IST)
భారత్ - న్యూజిలాండ్ మధ్య రెండో ట్వంటీ20 మ్యాచ్ ఆదివారం మౌంట్ మాంగనుయ్‌ వేదికగా జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ మెరుపులు మెరిపించాడు. కేవలం 49 బంతుల్లో సెంచరీ చేశాడు. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు. మొత్తంగా 51 బంతుల్లో 11 ఫోర్లు, ఏడు సిక్సర్ల సాయంతో 111 పరుగులు చేశాడు. 
 
ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లుగా బరిలోకి వచ్చిన ఓపెనర్లు ఇషాన్ కిషన్ 36, రిషబ్ పంత్ 6 చొప్పున మాత్రమే పరుగులు చేశారు. సూర్యకుమార్ 51 బంతుల్లో 11 ఫోర్లు, ఏడు సిక్స్‌ల సాయంతో 111 పరుగులు చేశాడు. 
 
అలాగే, శ్రేయాస్ అయ్యర్ 13, హార్దిక్ పాండ్యా 13, దీపక్ హూడా, సుదర్‌లు డకౌట్ అయ్యారు. భువనేశ్వర్ కుమార్‌ (1), అదనంగా 11 పరుగులు వచ్చాయి. దీంతో న్యూజిలాండ్ జట్టు ముంగిట 192 రన్స్‌గా టార్గెట్‌గా ఉంచింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత్ - కివీస్ రెండో టీ20కి పొంచివున్న వరుణ గండం!