Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గగనయాన్ ప్రయోగంలో మరో కీలక ఘట్టం పూర్తి...

parachute test
, ఆదివారం, 20 నవంబరు 2022 (10:31 IST)
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) వచ్చే యేడాది గగనయాన్ ప్రయోగాన్ని చేపట్టనుంది. ఇందుకోసం వివిధ రకాలైన ప్రయోగాలను వరుస క్రమంలో నిర్వహిస్తుంది. తాజాగా వ్యోమగాములను అంతరిక్షం నుంచి భూమికి తీసుకొచ్చే పారాచూట్‌లను పరీక్షించింది. 
 
విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (వీఎస్ఎస్సీ) ఈ పరీక్షను నిర్వహించింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఝూన్సీ జిల్లాలోని ఫీల్డ్ ఫైర్ రేంజ్ వద్ద దాన్ని క్రూడ్ మాడ్యూల్ డీసెలరేషన్ సిస్టంకు చెందిన ఇంటెగ్రేటెడ్ మెయిన్ పారాచూడ్ ఎయిర్ డ్రాఫ్ టెస్ట్‌ను నిర్వహించింది. 
 
అయితే, ఈ ప్రయోగంలో భాగంగా, క్రూ మాడ్యూల్ బరువుకు సమానమైన 5 టన్నుల డమ్మీ బరువును భారత వైమానిక దళానినికి చెందిన ఐఎల్ 76 విమానం ద్వారా 2.5 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకెళ్లి కిందకు జారవిడిచారు. ఆ తర్వాత ఈ మాడ్యూల్ సురక్షితంగా భూమిపైకి ల్యాండ్ అయింది.  
 
శనివారం చేపట్టిన ఈ ప్రయోగం రెండుమూడు నిమిషాల పాటు కొనసాగింది. పేలోడ్‌ బరువు నేలపై మృదుగువా ల్యాండ్ అయింది. ల్యాండింగ్ సమయంలో మెయిన్ పారాచూట్‌లు పేలోడ్‌ వేగాన్ని సురక్షితమైన వేగానికి తగ్గించినట్టు ఈ పరీక్షలో తేలింది. ఈ పరీక్షతో గగనయాన్ ప్రాజెక్టు ఓ ముఖ్యమైన మైలురాయిని చేరుకుందని ఇస్రో తెలిపింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆధార్ - పాన్ కార్డు అనుసంధానానికి తుది గడువు ఇదే...