Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కోవిడ్-19 టాస్క్‌ఫోర్స్‌లో క్రికెట్ దిగ్గజానికి చోటు

కోవిడ్-19 టాస్క్‌ఫోర్స్‌లో క్రికెట్ దిగ్గజానికి చోటు
, సోమవారం, 3 ఆగస్టు 2020 (22:21 IST)
ప్రపంచాన్ని కరోనా వైరస్ పట్టిపీడిస్తోంది. ఈ వైరస్ వల్ల అనేక క్రీడా పోటీలు వాయిదాపడుతున్నాయి. అయితే, త్వరలో ఐపీఎల్ పోటీల నిర్వహణకు భారత క్రికెట్​ నియంత్రణ మండలి(బీసీసీఐ) చర్యలు చేపట్టింది. ఇందుకోసం కొవిడ్​-19 టాస్క్​ఫోర్స్​లో క్రికెట్ దిగ్గజం, జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్​సీఏ) చీఫ్ రాహుల్ ద్రవిడ్​కు చోటుదక్కింది. 
 
రాష్ట్ర క్రికెట్ సంఘాలకు ప్రామాణిక నిర్వహణ విధానాన్ని(ఎస్​వోపీ) సోమవారం ప్రకటించిన బీసీసీఐ ఈ విషయాన్ని వెల్లడించింది. ఎస్​వోపీ నిబంధనలు పాటిస్తూ ప్రాక్టీస్ చేస్తామని ప్లేయర్లు ఆయా రాష్ట్ర సంఘాల సెంటర్లలో సంతకాలతో కూడిన పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. అలాగే బెంగళూరులోని ఎన్​సీఏలో ఆటగాళ్లకు ట్రైనింగ్​ను పునఃప్రారంభించేందుకు అవకాశం ఉంది.
 
కరోనా ప్రమాదం నేపథ్యంలో ట్రైనింగ్​లో ప్లేయర్లు అందరూ ఎస్​వోపీ నిబంధలు పాటించేలా చూసేందుకు బీసీసీఐ కొవిడ్​ టాస్క్​ఫోర్స్ ఏర్పాటుచేసింది. దీనిలో ద్రవిడ్​తో పాటు ఓ మెడికల్ ఆఫీసర్​, బీసీసీఐ ఏజీఎమ్​ కూడా ఉన్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో ఆటగాళ్లు నిబంధనలు పాటించేలా ఈ టాస్క్​ఫోర్స్ పర్యవేక్షించనుంది. అలాగే ప్లేయర్లకు వ్యక్తిగతంగా సలహాలు, సూచనలు ఇవ్వడంతో పాటు కరోనాపై సమాచారాన్ని అందివ్వనుంది. 
 
అనుసంధానం చేయనుంది. కాగా ఈ నెలలోనే ప్రారంభం కావాల్సిన దేశవాళీ సీజన్ కరోనా కారణంగా వాయిదా పడింది. మళ్లీ ప్రారంభమవుతుందో కూడా తెలియని పరిస్థితి. ప్లేయర్లు సైతం దాదాపుగా నాలుగు నెలల నుంచి ప్రాక్టీస్​కు దూరంగా ఉన్నారు. అయితే ఎస్​వోపీని పాటిస్తూ రాష్ట్ర సంఘాల కేంద్రాలు, ఎన్​సీఏలో ప్రాక్టీస్ చేసేందుకు బీసీసీఐ తాజాగా అనుమతించింది. దీని కోసం ఎస్​వోపీని పాటిస్తామని ప్లేయర్లు సంతకాలు చేయాల్సి ఉంటుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహిళల ఐపీఎల్.. బీసీసీఐ గ్రీన్ సిగ్నల్.. కరోనా కాలంలో సూపర్ క్రికెట్ టోర్నీ