Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ధోనీలో మరో కోణం ఉంది.. నోరు తెరిస్తే పచ్చి బూతులే.. ఇషాంత్ శర్మ

Advertiesment
ishant sharma
, గురువారం, 6 జులై 2023 (08:52 IST)
మిస్టర్ కూల్‌గా గుర్తింపు పొందిన భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గురించి సంచలన విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. అందరూ అనుకున్నంతగా ధోనీ శాంతస్వభావి కాదని, నోరు తెరిస్తే పచ్చి బూతులే వస్తాయంటా భారత క్రికెట్ జట్టు ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ధోనీతో తాను కూడా తిట్లు తిన్నానని చెప్పాడు. పైగా, ధోనీ జాబితాలో కామ్ అండ్ కూల్‌ లేవని వ్యాఖ్యానించారు.
 
ఇదేవిషయంపై ఇషాంత్ శర్మ స్పందిస్తూ, ధోనీకి ఎన్నో బలాలున్నా కామ్ అండ్ కూల్ మాత్రం ఆ జాబితాలో లేవని తెలిపాడు. మైదానంలో ఆటగాళ్లను బూతులు తిడుతుంటాడని, తాను వినడమే కాకుండా అతడితో తిట్లు కూడా తిన్నానని చెప్పుకొచ్చాడు. తానోసారి బౌలింగ్ పూర్తిచేశాక ధోనీ తన వద్దకు వచ్చి నువ్వు అలసిపోయావా? అని అడిగాడని దానికి తాను ఔను అని సమాధానమిస్తే వయసైపోయింది.. రిటైర్ అయిపోమని సలహా ఇచ్చాడని గుర్తు చేసాడు. 
 
ఒకసారి మహీబాయ్ విసిరిస త్రోను తాను అందులేకపోయినందుకు తనపై కోపంగా చూశాడని, రెండోసారి బలంగా విసిరిన త్రోను కూడా పట్టుకోలేకపోయానని పేర్కొన్నాడు. మూడోసారి వేసేటపుడు మాత్రం ఈసారి తలబాదుకో అని గట్టిగా అరిచాడంటూ ధోనీ కోపం గురించి ఇషాంత్ శర్మ వివరించాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రమాదానికి గురైన క్రికెటర్ ప్రవీణ్ కుమార్.. కుమారుడు కూడా..