Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ధోనీ కాదు.. పాట్ కమిన్స్ కొత్త మిస్టర్ కూల్.. సెహ్వాగ్

pat cummins
, గురువారం, 22 జూన్ 2023 (22:56 IST)
భారత జట్టు మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ క్రికెట్ మ్యాచ్‌లపై ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా తన అభిప్రాయాలను పంచుకోవడం చేస్తుంటాడు. ఆ విధంగా ఇంగ్లండ్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌పై తన అభిప్రాయాలను ట్విట్టర్ ద్వారా పంచుకున్నాడు. 
 
ఇంగ్లండ్‌లో పర్యటించిన ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ఐదు మ్యాచ్‌ల యాషెస్ సిరీస్‌లో పాల్గొంటోంది. ఈ రెండు జట్ల మధ్య 16న ప్రారంభమైన తొలి టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు రెండు వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. 
 
ఈ మ్యాచ్‌లో తొలుత ఆడిన ఇంగ్లండ్ జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 393 పరుగులు చేయగా, ఆస్ట్రేలియా జట్టు 386 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఏడు పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ఆడిన ఇంగ్లండ్ జట్టు 223 పరుగులు చేసింది. 
 
అనంతరం ఆస్ట్రేలియాకు 281 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. దీనిపై అద్భుతంగా ఆడిన ఆస్ట్రేలియా జట్టు ఎనిమిది వికెట్లు కోల్పోయి 282 పరుగులు చేసి రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
 
ఈ మ్యాచ్‌పై సెహ్వాగ్ మాట్లాడుతూ.. "ఎంత అద్భుతమైన టెస్ట్ మ్యాచ్. ఇటీవలి కాలంలో నేను చూసిన అత్యుత్తమ టెస్టు మ్యాచ్ ఇదే. ముఖ్యంగా వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని తొలి రోజు ముగిసేలోపు డిక్లేర్ చేయడం ఇంగ్లండ్‌కు ధైర్యమైన నిర్ణయం. కానీ ఖవాజా రెండు ఇన్నింగ్స్‌ల్లో అద్భుతంగా ఆడాడు. మహేంద్ర సింగ్ ధోనీ కాదు.. టెస్టు క్రికెట్‌లో పాట్ కమిన్స్ కొత్త మిస్టర్ కూల్. అతను మ్యాచ్‌ని ముగించి ఒత్తిడితో కూడిన వాతావరణంలో గొప్ప భాగస్వామ్యాన్ని నెలకొల్పిన ఈ మ్యాచ్ నాకు చాలా కాలం గుర్తుండిపోతుంది.. అంటూ వ్యాఖ్యానించాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

‘జడేజా.. త్వరగా ఔట్ అవ్వాలి.. ధోనీ బ్యాటింగ్ చేయాలి.. కోపం వచ్చిందా?