Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 26 April 2025
webdunia

నా భర్తను ఐపీఎల్ టోర్నీలో ఆడనివ్వొద్దు : షమీ భార్య

భారత క్రికెటర్ మహ్మద్ షమీకి కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. ఆయన భార్య తాజాగా అతన్ని ఐపీఎల్‌ టోర్నీలో ఆడనివ్వొద్దని కోరింది. ఈ మేరకు ఆమె షమీని కొనుగోలు చేసిన ఫ్రాంచైజీ యాజమాన్యాన్ని కలిసి విజ్ఞప్తి చేసింద

Advertiesment
Mohammed Shami
, ఆదివారం, 1 ఏప్రియల్ 2018 (11:40 IST)
భారత క్రికెటర్ మహ్మద్ షమీకి కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. ఆయన భార్య తాజాగా అతన్ని ఐపీఎల్‌ టోర్నీలో ఆడనివ్వొద్దని కోరింది. ఈ మేరకు ఆమె షమీని కొనుగోలు చేసిన ఫ్రాంచైజీ యాజమాన్యాన్ని కలిసి విజ్ఞప్తి చేసింది. ఫ్రాంచైజీ సీఈఓ హేమంత్ దువాని జహాన్ ఇటీవల కలిసింది. 'హేమంత్ ఎదుట నా బాధను వినిపించాను. కుటుంబ సమస్యను పరిష్కరించుకునేంత వరకు షమీని ఐపీఎల్‌లో ఆడనివ్వొద్దని ఆయన్ను కోరాను' అని జహాన్ ఏఎన్ఐ వార్తా సంస్థకు తెలిపింది.
 
కాగా, ఈ ఏడాది జనవరిలో నిర్వహించిన ఐపీఎల్ వేలంపాటలో ఢిల్లీ డేర్ డెవిల్స్ టీమ్ షమీని రూ.3 కోట్లకు తిరిగి దక్కించుకున్న సంగతి తెలిసిందే. షమీకి పలువురు యువతులతో అక్రమ సంబంధాలు ఉన్నాయని, అతను తనను శారీరకంగా, మానసికంగా చాలా ఇబ్బందులకు గురి చేశాడని జహాన్ గతంలో సంచలన ఆరోపణలు చేసింది. వాటితో పాటు ఆమె చేసిన మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల నుంచి మాత్రం షమీకి బీసీసీఐ క్లీన్‌చిట్ ఇచ్చింది. కాగా, ఈనెల 7వ తేదీ నుంచి ఐపీఎల్ సీజన్ ప్రారంభంకానుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నా ప్రవర్తనతో క్రికెట్‌కు చెడ్డపేరు తెచ్చా : డేవిడ్ వార్నర్