Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పాక్ ఓడింది.. భారత్ సెమీస్ పోరు ఎవరితోనో ఖాయమైంది..!

pakistan team
, శనివారం, 11 నవంబరు 2023 (23:07 IST)
ఇంగ్లండ్ చేతిలో పాకిస్థాన్ ఓడింది. ప్రపంచ కప్ నాకౌట్ మ్యాచ్‌లో 43.3 ఓవర్లలో 244 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 338 పరుగుల విజయలక్ష్యాన్ని పాకిస్థాన్ 6.4 ఓవర్లలో ఛేదిస్తే పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంతో పాక్ సెమీస్ చేరుతుంది. 
 
కానీ, పాక్ ఈ విషయంలో విఫలం కావడంతో మ్యాచ్ పూర్తి కాకముందే ఆ జట్టు టోర్నీ నుంచి అధికారికంగా నిష్క్రమించింది. దాంతో న్యూజిలాండ్ జట్టుకు సెమీస్ బెర్తు ఖరారైంది. 
 
టీమిండియా (16), దక్షిణాఫ్రికా (14), ఆస్ట్రేలియా (14) ఇప్పటికే సెమీస్ చేరడం తెలిసిందే. ఇప్పుడు పాక్ నిష్క్రమణ నేపథ్యంలో కివీస్ నాలుగో జట్టుగా సెమీస్‌కు అర్హత సాధించింది. న్యూజిలాండ్ 9 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో 10 పాయింట్ల సాధించింది. 
 
పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న టీమిండియాతో, నాలుగో స్థానంలో ఉన్న న్యూజిలాండ్ తొలి సెమీఫైనల్లో తలపడనుంది. భారత గడ్డపై జరుగుతున్న ఐసీసీ వరల్డ్ కప్‌లో మొదటి సెమీఫైనల్ ఈ నెల 15న ముంబైలోని వాంఖెడే స్టేడియంలో జరగనుంది. 
 
రెండో సెమీఫైనల్ కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో ఈ నెల 16న జరగనుంది. ఫైనల్ మ్యాచ్ ఈ నెల 19న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నిర్వహించనున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆఫ్ఘన్ క్రికెట్ జట్టుకు మంచి భవిష్యత్తు.. జద్రాన్ అరుదైన రికార్డ్