Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఐసీసీ ట్వంటీ20 వరల్డ్ కప్ : మ్యాచ్ వర్షార్పణం... ఫైనల్‌కు భారత్

ఐసీసీ ట్వంటీ20 వరల్డ్ కప్ : మ్యాచ్ వర్షార్పణం... ఫైనల్‌కు భారత్
, గురువారం, 5 మార్చి 2020 (12:42 IST)
సిడ్నీ వేదికగా ఐసీసీ ట్వంటీ20 వరల్డ్ కప్ జరుగుతోంది. ఈ టోర్నీలో భాగంగా, గురువారం ఆతిథ్య ఇంగ్లండ్, పర్యాటక భారత్ జట్ల మధ్య అత్యంత కీలకమైన మ్యాచ్ జరగాల్సివుంది. అయితే, వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ రద్దు అయింది. దీంతో లీగ్ దశలో ఒక్క మ్యాచ్‌లో ఓడిపోకుండా వచ్చిన భారత మహిళల క్రికెట్ నేరుగా ఫైనల్‌కు అడుగుపెట్టింది. గత టోర్నీలో భారత జట్టు ఇదే ఇంగ్లండ్ చేతిలో ఓడిపోయి ఇంటిదారిపట్టిన విషయం తెల్సిందే. ఇపుడు ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నట్టయింది. 
 
ఇదిలావుంటే టీమిండియా ఈ మెగా టోర్నమెంట్‌లో ఆడిన నాలుగు లీగ్ మ్యాచ్‌ల్లోనూ గెలిచి మెరుగైన రన్‌రేట్ సాధించడం వల్ల ఫైనల్ పోరుకు అర్హత సాధించింది. కాగా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య రెండో సెమీఫైనల్ జరగనుంది. ఒకవేళ ఆ మ్యాచ్ కూడా రద్దయితే.. ఆదివారం భారత్ జట్టు దక్షిణాఫ్రికాతో తలపడనుంది. 

గ్రూపు ఏ లో ఉన్న భారత క్రికెట్ జట్టు తాను ఆడిన నాలుగు మ్యాచ్‌లలో విజయభేరీ మోగించింది. ముఖ్యంగా, పటిష్టమైన ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, శ్రీలంక, న్యూజిలాండ్ జట్లను చిత్తు చేసింది. చివరగా ఇంగ్లండ్‌తో గురువారం మ్యాచ్ జరగాల్సివుంది. ఈ మ్యాచ్ వర్షం కారణంగా నిలిచిపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహిళల ట్వంటీ20 వరల్డ్ కప్- సెమీఫైనల్‌కు వర్షం అడ్డంకి.. భారత్‌కు లాభమే