Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నవంబర్‌ 16 నుంచి రంజీ ట్రోఫీ.. 2,127 మ్యాచ్‌ల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్

నవంబర్‌ 16 నుంచి రంజీ ట్రోఫీ.. 2,127 మ్యాచ్‌ల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్
, శనివారం, 3 జులై 2021 (23:08 IST)
గతేడాది కోవిడ్ కారణంగా సరిగ్గా నిర్వహించలేకపోయిన దేశవాళీ క్రికెట్‌ను బీసీసీఐ ఈసారి పూర్తిస్థాయిలో జరపడానికి సిద్ధమైంది. ఇందులో భాగంగా  మొత్తం 2,127 మ్యాచ్‌ల నిర్వహణకు పచ్చజెండా ఊపింది. 
 
నవంబర్‌ 16 నుంచి రంజీ ట్రోఫీ మొదలవ్వనున్నట్లు తెలిసింది. ఈ మేరకు బీసీసీఐ సెక్రటరీ జైషా శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. గతేడాది కరోనా నేపథ్యంలో రంజీ ట్రోఫీతో పాటు మిగతా  టోర్నీలేవీ జరగని సంగతి తెలిసిందే.
 
అప్పుడు కేవలం సయ్యద్‌ ముస్తాక్‌ అలీ, విజయ్‌ హజారే ట్రోఫీలు మాత్రమే నిర్వహించింది. ఈ ఏడాది అలా కాకుండా అన్ని టోర్నీలను మునుపటిలా నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. ‘ఈ 2021-22 సీజన్‌ సెప్టెంబర్‌ 21 నుంచి సీనియర్‌ మహిళల వన్డే లీగ్‌తో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత అక్టోబర్‌ 27 నుంచి సీనియర్‌ మహిళల వన్డే ఛాలెంజర్‌ ట్రోఫీ ఉంటుంది. 
 
ఈ క్రమంలోనే అక్టోబర్‌ 20 నుంచి నవంబర్‌ 12 వరకు సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 ట్రోఫీ, నవంబర్‌ 16 నుంచి 2022 ఫిబ్రవరి 19 వరకు రంజీ ట్రోఫీలు జరగనున్నాయి. ఫిబ్రవరి 23 నుంచి మార్చి 26 వరకు విజయ్‌ హజారే ట్రోఫీ నిర్వహించనున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వివాదంలో దినేశ్ కార్తీక్.. బ్యాట్లను పరాయి మగాళ్ల భార్యలతో పోల్చడమా?