Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆస్ట్రేలియా క్రికెటర్లకు కోపం నషాళానికి ఎక్కింది..

మామూలుగానే ఆస్ట్రేలియా క్రికెటర్లకు కాస్త దురుసెక్కువ. అటు మైదానంలోకాకుండా, ఇటు ఆరుబయట కూడా వారు అలానే ప్రవర్తిస్తుంటారు. ఇక ఎవరైనా వారు చెప్పినట్టు వినకుంటే వదిలిపెడతారా.. చీల్చిఆరేస్తారు. ఇలాంటి సంఘ

ఆస్ట్రేలియా క్రికెటర్లకు కోపం నషాళానికి ఎక్కింది..
, గురువారం, 21 సెప్టెంబరు 2017 (06:06 IST)
మామూలుగానే ఆస్ట్రేలియా క్రికెటర్లకు కాస్త దురుసెక్కువ. అటు మైదానంలోకాకుండా, ఇటు ఆరుబయట కూడా వారు అలానే ప్రవర్తిస్తుంటారు. ఇక ఎవరైనా వారు చెప్పినట్టు వినకుంటే వదిలిపెడతారా.. చీల్చిఆరేస్తారు. ఇలాంటి సంఘటనే ఒకటి కోల్‌కతాలో జరిగింది. 
 
భారత్‌తో క్రికెట్ సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టు పర్యటిస్తోంది. చెన్నైలో జరిగిన తొలి వన్డేలో చిత్తుగా ఓడింది. రెండో వన్డే కోసం ఇరు జట్లూ కోల్‌కతాకు చేరుకున్నారు. ఇక్కడే ఆస్ట్రేలియా క్రికెటర్లకు కోపం నషాళానికి ఎక్కింది. 
 
చికెన్ నచ్చకపోవడంతో వారికి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. బుధవారం మ‌ధ్యాహ్నం 1.30కి కోల్‌క‌తాలోని ఈడెన్ గార్డెన్స్‌లో రెండో వ‌న్డే ఆడడం కోసం వచ్చిన ఆస్ట్రేలియా ఆట‌గాళ్ల‌కు బెంగాల్‌ క్రికెట్‌ సంఘం అధికారులు వడ్డించిన చికెన్ రుచించలేదు‌. 
 
చికెన్‌ను 73 డిగ్రీ సెంటిగ్రేడ్‌ వద్ద కాకుండా ఎక్కువగా వేడి చేయించవ‌ద్ద‌ని ఆస్ట్రేలియా ఆటగాళ్లు బెంగాల్‌ క్రికెట్ సంఘానికి చెప్పార‌ట‌. అయిన‌ప్ప‌టికీ చికెన్‌ను బాగా వేడి చేసేసి వడ్డించడంతో ఆసిస్ ఆట‌గాళ్ల‌కి కోపం వ‌చ్చేసింది. ఈ విష‌యాన్ని వారు నిల‌దీసి అడ‌గ‌డంతో మ‌రోసారి ఇటువంటి పొర‌పాటు చేయ‌బోమ‌ని న‌చ్చ‌జెప్పి వంట‌వారు ఆ ఆట‌గాళ్ల‌ను కూల్ చేశార‌ట‌.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ధోనీ.. అగ్నిశిఖలా దూసుకుపోతున్నాడు : మైఖేల్ క్లార్క్