Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

డబుల్ డోస్ వ్యాక్సిన్ ఇచ్చారు.. అంతే స్పృహతప్పి పడిపోయిన యువతి

డబుల్ డోస్ వ్యాక్సిన్ ఇచ్చారు.. అంతే స్పృహతప్పి పడిపోయిన యువతి
, శనివారం, 19 జూన్ 2021 (09:41 IST)
కంట్లూరులో కలకలం రేగింది. ఓ యువతికి వైద్య సిబ్బంది ఒకే సారి డబుల్ డోస్ వ్యాక్సిన్ ఇచ్చింది. గుట్టుచప్పుడు కాకుండా యువతిని ఆసుపత్రిలో అబ్జర్వేషన్‌లో ఉంచారు. వ్యాక్సిన్ కోసం అబ్దుల్లాపూర్ మెట్ జెడ్పీహెచ్‌కు లక్ష్మీ ప్రసన్న (21) వెళ్లారు. ఫోన్ మాట్లాడుతూ ఆమెకు నర్సు పద్మ వెంట వెంటనే రెండు డోసుల వాక్సిన్స్ ఇచ్చారు. వాక్సిన్ అనంతరం కొద్దీ సేపటికే యువతి కళ్ళు తిరిగి పడిపోయారు.
 
వెంటనే ఆమెను వనస్థలిపురం ఏరియా ఆసుపత్రికి యువతిని తరలించారు. ప్రస్తుతం లక్ష్మీ ప్రసన్న ఆరోగ్య పరిస్థితి నిలకడగా వున్నప్పటికి అబ్జర్వేషన్‌లో ఉంచామని వైద్యులు అంటున్నారు. లక్ష్మీ ప్రసన్నకు ఏమి జరుగుతుందోనని కటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు.
 
విషయం వెలుగులోకి రావడంతో నర్సు నిర్లక్యంపై స్థానికులు మండిపడుతున్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. నర్సు పద్మను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వ్యాక్సిన్ కోసం వెళ్లిన వారిని పట్టించుకోకుండా గంటలు గంటలు ఫోన్లు మాట్లాడుతూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణాలో అన్‌లాక్? : థియేటర్లకు అనుమతి.. కొనసాగనున్న రాత్రి కర్ఫ్యూ